Home » Tirumala
పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధ వాతావరణం నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్ బలగాలు శనివారం మాక్డ్రిల్ నిర్వహించాయి. సామాన్యులు బస చేసే యాత్రికుల వసతి సముదాయం-3(పీఏసీ)లో ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో గంటన్నర పాటు ఈ ప్రక్రియ చేపట్టాయి.
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో 12మందిపై తొలి చార్జిషీటును సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. మరో పది రోజుల్లో రెండో చార్జిషీటు కూడా దాఖలయ్యే అవకాశం ఉంది
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై. లక్ష్మణరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేదపండితుల ఆశీర్వచనంతో లడ్డూ ప్రసాదాలు స్వీకరించారు
అలిపిరిలోని 35 ఎకరాల భూమిని టీటీడీ ఏపీ టూరిజం అథారిటీకి కేటాయించగా, పేరూరు గ్రామంలోని 10.32 ఎకరాలు సహా మొత్తం 35 ఎకరాలను టీటీడీకి బదలాయించాలని బోర్డు నిర్ణయించింది. ఈ భూకదలికకు సంబంధించి ప్రభుత్వాన్ని వేగంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాయనుంది
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు శుభవార్త చెప్పారు. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల కోసం ఎలక్ట్రిక్ బస్సులను ఉచితంగా నడపనున్నారు. ఈ వాహనాల్లో తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు యాత్రికులను తీసుకెళ్లాలని ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయించినట్లు సమాచారం.
తిరుమల శ్రీవారి ఆలయం ముందు కాకినాడ బాలిక రేఖాడి చైత్ర 15 నిమిషాల పాటు యోగాసనాలు వేయగా భక్తులు ఆశ్చర్యపోయారు.యోగాలో జాతీయ స్థాయిలో మెడల్ సాధించాలన్న లక్ష్యంతో ఆమె సాధన కొనసాగుతోంది.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీవీ వేణుగోపాల్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ధ్వజస్తంభానికి మొక్కిన ఆయన, గర్భాలయంలో మూలవిరాట్టును దర్శించుకొని, వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు
తిరుమలలో వరుస సెలవులతో భక్తుల రద్దీ తీవ్రమైంది. సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుండగా, వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పలువురు ప్రముఖులు కూడా శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక దర్శనం అందుకున్నారు.
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల కొత్త షెడ్యూల్ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రోటోకాల్, రిఫరల్, బ్రేక్ దర్శనాలను ఉదయం 7.30 గంటల లోపు పూర్తి చేసి, సామాన్యులకు అదనంగా దర్శన సమయం కల్పించనున్నారు.