Home » Tirumala
‘‘ఏడు కొండల సామి.. ఎక్కడున్నావయ్యా... ఎన్నీ మెట్లెక్కినా.. కానరావేమయ్యా.. ఈ అడవిదారిలో.. చేయూతనీయవా..’’ అంటూ శ్రీవేంకటేశ్వర మహత్యము సినిమాలోని పాట, తిరుమలకు చేరుకోవడం ఎంత కష్టమో వివరిస్తుంది. ఇప్పుడంటే ఎక్కడానికీ దిగడానికీ వేరువేరుగా సురక్షితమైన తారురోడ్లు ఉన్నాయి కానీ... ఒకప్పుడు దట్టమైన అడవిలో, క్రూరమృగాల నడుమ నుంచి, వాగులు వంకలు దాటి బండలు కొండలు ఎక్కి, లోయలు దాటి తిరుమలకు చేరుకోవాల్సి వచ్చేది.
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే ఒక ముహూర్తం ఉండాలి. తాళి, తలంబ్రాలు ఉండాలి. మంగళమేళాలు హంగూ ఆర్భాటాలు తప్పనిసరి. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి సన్నిధిలో మాత్రం వీటిలో దేనికీ ప్రాధాన్యం లేదు. ఇవేవీ లేకుండానే పెళ్లి జరిగిపోతుంది.
తిరుమల శ్రీనివాసుడిని దర్శించు కోవడమే ఒక దివ్యానుభూతి. ఎక్కడెక్కడి నుంచో కష్టాలకోర్చి తిరుమలకు చేరుకుంటారు. గంటలకు గంటలు క్యూల్లో వేచివుండి అయినా స్వామి దర్శనం చేసుకుంటారు. వసతుల్లేవని విసుక్కోరు. క్షణకాలం ఆయన మూల మూర్తిని దర్శించుకోగానే పడ్డ శ్రమంతా మరచి పోతారు.
తిరుమల వెంకన్నకి రోజూ షడ్రసోపేతమైన ఆహారపదార్థాలే నైవేద్యంగా పెడతారు. ఇవన్నీ పోషకవిలువలు మెండుగా ఉన్నవే. ఆయుర్వేదపరంగా అత్యంత ఆరోగ్యకరమైనవే. దాదాపు 50 రకాలైన నైవేద్యాలను స్వామికి సమర్పిస్తారు.
ప్రపంచ సంపన్నుల జాబితాను ఏటా లెక్కలు కట్టి వెల్లడించే ‘ఫోర్బ్స్’ సంస్థ గనుక దేవుళ్లలోకెల్లా ధనవంతులెవరు? అని ఆరా తీసి అంచనా వేస్తే... నెంబర్ వన్ స్థానం బహుశా మన తిరుమల వెంకన్నకే దక్కుతుంది. వేంకటేశుని ధర్మకర్తల మండలి టీటీడీ వార్షిక బడ్జెట్టే రూ.5వేల కోట్లకు పైనే.
లోకకల్యాణం కోసం సప్తగిరుల్లో వెలసిన అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామికి సాక్షాత్తు బ్రహ్మ దేవుడే ఉత్సవాలను నిర్వహించాడట. బ్రహ్మ స్వయంగా నిర్వహించిన ఉత్సవాలు కావటంతోనే ‘బ్రహ్మోత్సవాలు’గా పేరు పొందాయని పురాణాల ద్వారా తెలుస్తోంది.
శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఇంతటి వైభవాన్ని సంతరించుకోవడం వెనుక అనేకమంది రాజుల, రాణుల పాత్ర ఉంది. దీపాల వెలుగుల మొదలు స్వామికి సమర్పించే పూలూ, నైవేద్యం దాకా లోటు లేకుండా కొనసాగడానికి వెయ్యేళ్లుగా ఎందరో చేసిన దానధర్మాలే కారణం.
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఇందులో ప్రధానంగా వివిధ వాహనాలపై ఊరేగే ఉత్సవమూర్తులు కిలోల కొద్దీ బంగారు, వజ్ర ఆభరణాలతో శోభాయమానంగా దర్శనమిస్తుంటారు.
ప్రపంచంలో 197 దేశాలుంటే 157 దేశాల కరెన్సీ శ్రీవారి హుండీలో లభించింది. 2015 నుంచి 2025 మార్చి వరకు ఉన్న రికార్డుల ఆధారంగా చూస్తే రూ.201,65,97,829 విదేశీ కాయిన్స్, నోట్లు అందాయి.
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. లోక్అదాలత్లో రాజీ కుదిర్చిన కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలివ్వడంతో అప్పటి అధికారులు, పాలకుల గుండెల్లో గుబులు మొదలైంది.