Home » Tirupati
అర్ధరాత్రి రెండు గంటల నుంచి టవర్ పైనే ఉంటూ హల్చల్ చేస్తున్నాడు. వెంటనే గుర్తించిన గ్రామస్తులు అతడిని కిందకు దిగాల్సిందిగా కోరారు. వారి ప్రయత్నాలు ఫలించలేదు.
మొత్తం ఆరుగురు సీనియర్ విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. దాడి చేయడంతో పాటు ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తాం అంటూ బెదిరింపులకు దిగారు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు తమిళనాడు రాష్ట్రం నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్ధం పలు నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్స్ప్రెస్ రవాణా సంస్థ (ఎస్ఈటీసీ) విడుదల చేసిన ప్రకటనలో... తిరుమల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 2వ తేది వరకు జరుగనున్నాయి.
మహాలయ అమావాస్య నేపథ్యంలో తిరుపతి సమీపంలోని కపిల తీర్థానికి భక్తులు భారీగా పోటెత్తారు.
సంపన్నులతో వేలూ లక్షలూ ఖర్చుపెట్టించే తిరుమల వెంకన్న, పేదలకు మాత్రం పైసా ఖర్చు లేకుండా తన దర్శనం చేసుకునే అవకాశం కల్పించాడు. తిరుపతికి చేరుకున్న భక్తులు చేతిలో పైసా లేకపోయినా సలక్షణంగా తిరుమలకు చేరుకుని స్వామి దర్శనం చేసుకోవచ్చు.
కలియుగ వైకుంఠంగా బ్రహ్మాండ పురాణం కీర్తించిన శేషాచలం ఆధ్యాత్మికంగానే కాకుండా చారిత్రకంగా కూడా అత్యంత ప్రాముఖ్యం గలది. ఈ పర్వత శ్రేణి ప్రాచీన అవశేషాల పుట్ట. కోట్ల ఏళ్ల కిందటి సహజ శిలాతోరణం మొదలుకుని, ఆదిమ మానవుల సంచారం దాకా... పల్లవుల నిర్మాణాల నుంచి విజయనగర రాజుల కట్టడాల దాకా శేషాచలం నిండా పురాతన అవశేషాలు పరుచుకుని కనిపిస్తాయి.
తిరుమల అనగానే శ్రీవేంకటేశ్వరుడు కొలువైన దివ్య క్షేత్రం అని అందరికీ తెలుసు. అయితే తిరుమల ఆలయంలో కలియుగ అవతారమైన శ్రీనివాసుడితో పాటూ త్రేతాయుగంలో ఆరాధ్యుడైన శ్రీరాముడు, ద్వాపర యుగంలో భక్తజన రక్షకుడైన శ్రీకృష్ణుడు కూడా భక్తుల పూజలను స్వీకరిస్తూ అంతే వైభవంగా వేడుకలు అందుకుంటున్నారని చాలామందికి తెలియదు.
‘తీర్థాల సన్నిధి యందు స్నానం సేయగనే పుణ్యములు పొంగునయా’ అని తిరుమల కొండల్లోని పుణ్య తీర్థాల గురించి తాళ్లపాక అన్నమా చార్యులు ఓ కీర్తనలో చెబుతారు. శేషాచలం అంతా తీర్థాల మయం. ఈ కొండల్లో 66కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నాయని బ్రహ్మపురాణం, స్కంధ పురాణం వెల్లడిస్తాయి.
‘‘ఏడు కొండల సామి.. ఎక్కడున్నావయ్యా... ఎన్నీ మెట్లెక్కినా.. కానరావేమయ్యా.. ఈ అడవిదారిలో.. చేయూతనీయవా..’’ అంటూ శ్రీవేంకటేశ్వర మహత్యము సినిమాలోని పాట, తిరుమలకు చేరుకోవడం ఎంత కష్టమో వివరిస్తుంది. ఇప్పుడంటే ఎక్కడానికీ దిగడానికీ వేరువేరుగా సురక్షితమైన తారురోడ్లు ఉన్నాయి కానీ... ఒకప్పుడు దట్టమైన అడవిలో, క్రూరమృగాల నడుమ నుంచి, వాగులు వంకలు దాటి బండలు కొండలు ఎక్కి, లోయలు దాటి తిరుమలకు చేరుకోవాల్సి వచ్చేది.
తిరుమల శ్రీనివాసుడిని దర్శించు కోవడమే ఒక దివ్యానుభూతి. ఎక్కడెక్కడి నుంచో కష్టాలకోర్చి తిరుమలకు చేరుకుంటారు. గంటలకు గంటలు క్యూల్లో వేచివుండి అయినా స్వామి దర్శనం చేసుకుంటారు. వసతుల్లేవని విసుక్కోరు. క్షణకాలం ఆయన మూల మూర్తిని దర్శించుకోగానే పడ్డ శ్రమంతా మరచి పోతారు.