Home » Tirupati
నగరంలో సూపర్ సిక్స్-సూపర్హిట్ బహిరంగ సభ నేపథ్యంలో బుధవారం ట్రాఫిక్ మళ్లించినట్లు ఎస్పీ జగదీష్ ప్రకటనలో తెలిపారు. ఆంక్షలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనదారులు అనంతపురం నగరం నుంచి కాకుండా వడియంపేట, బుక్కరాయసముద్రం, నాయనపల్లి క్రాస్, నార్పల క్రాస్, బత్తలపల్లి, ధర్మవరం, ఎన్ఎస్ గేట్ మీదుగా నేషనల్ హైవే 44 మార్గంలో వెళ్లాలన్నారు.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది దాకా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డవారిని వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు.
రాజకీయాలు, నిజ జీవితంలో పౌరుషానికి మారుపేరుగా బతికిన నాయకుడు నందమూరి హరికృష్ణ అని, సినిమాలు, రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా పవన్ కల్యాణ్ నిలిచారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు.
దసరా, దీపావళి సందర్భంగా కొన్ని మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్లను అక్టోబరు నుంచి నవంబరు వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఆటో డ్రైవర్ అశోక్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ హేమంత్కు మధ్య పాత కక్షలు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
స్త్రీ శక్తి పథకాన్ని కూటమి ప్రభుత్వం భారంగా కాకుండా, బాధ్యతగా భావిస్తోందని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు.
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. రేపు పలు టికెట్లను అందుబాటులోకి తేనుంది.
ఇంట్లోని టీవీ వెనుక కప్బోర్డులో 80 గ్రాముల బంగారు నగలు ఉంచారు. 20వ తేదీ చూస్తే ఉన్నాయి. శుక్రవారం ఉదయం చూస్తే లేవు. 20వ తేదీన మధ్యాహ్నం షాపునకు వెళ్లొచ్చిన అరగంట వ్యవధిలోనే దొంగతనం చేసుంటారని భావించారు.
గత ఐదు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ బురద జల్లుతోందని టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీపై వైసీపీ ఆరోపణలు అన్ని అవాస్తావాలని చెప్పుకొచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక్క ప్రోటోకాల్ తప్పా ఎలాంటి సదుపాయాలు ఉపయోగించుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.
కింద పట్ట పరిచారు. ఒక పక్క పరదా కట్టారు. ఇలా రోడ్డుకు దూరంగా పొలాల్లో పేకాట స్థావరం పెట్టారు. ఎక్కడో పొలాల్లో ఉన్న తమను ఎవరు పట్టుకుంటారులే అని ధీమాగా పేకాట ఆడుతున్న వారు.. ఆకాశం నుంచి నిఘా పెట్టిన డ్రోన్కు చిక్కారు.