Home » Trains
రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ అంతా అవాక్కయ్యేలా చేసింది. సీట్ల కోసం కుస్తీ పట్టలేదు గానీ.. సీట్లో కూర్చుని ఆమె చేసిన పనే.. వీడియో వైరల్ అవడానికి కారణమైంది. ఇంతకీ ఆమె ఏం చేసిందో మీరే చూడండి..
ఓ రైల్లో జనం రద్దీగా ఉన్నారు. బోగీలో అటూ, ఇటూ నడవడానికీ ఇబ్బందిగా ఉంది. ఈ సమయంలో ఓ పిల్లాడికి మూత్రం అర్జంట్ అయింది. అయితే పిల్లాడిని బాత్రూం తీసుకెళ్లడానికి తండ్రికి పెద్ద సమస్యగా మారింది. దీంతో చివరికి ఏం చేశాడో మీరే చూడండి..
శబరిమల క్షేత్రంలో అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్ధం కాట్పాడి -సేలం మీదుగా కొట్టాయం వరకు ఈ నెల 24న ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. శబరిమలై భక్తుల కోసం తెలంగాణ రాష్ట్రం చర్లపల్లి నుండి కేరళలోని కొట్టాయం వరకు ప్రత్యేక రైలు నడుపుతున్నారు.
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని దూరప్రాంతాలకు ఎక్స్ప్రెస్ రైళ్లలో వెళ్లే నగర ప్రయాణికులకు దక్షిణ మధ్యరైల్వే ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో నడిచే 16 ఎక్స్ప్రెస్ రైళ్లకు హైటెక్సిటీ స్టేషన్లో ప్రత్యేకంగా హాల్టింగ్ ఏర్పాటు చేసింది.
క్రిస్మస్, సంక్రాంతి సెలవులు దగ్గరపడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ట్రైన్ టికెట్ బుకింగ్స్ జోరందుకుంది. తక్కువ ఖర్చు సహా సురక్షిత మార్గంలో గమ్యస్థానాలకు చేరుకోవడమే ఇందుకు కారణం. అయితే.. పిల్లలతో కలిసి రైలు ప్రయాణం చేయదలిచినవారు ఓసారి ఈ విషయం తెలుసుకోండి.
ప్రయాణికుల సౌకర్యార్థం కోయంబత్తూరు-మదార్ (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోయంబత్తూరు-మదార్ ప్రత్యేక రైలు (నం. 06181) ఈ నెల 13, 20, 27, డిసెంబరు 4 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 06182) ఈ నెల 16, 23, 30, డిసెంబరు 7 తేదీల్లో నడపనున్నట్లు వెల్లడించారు.
భారతీయ రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానంలో మరో కీలక మార్పు చేసింది. ఫేక్ బుకింగ్లు, టికెట్ దళారులను అరికట్టడానికి IRCTC కొత్త నియమాన్ని అమలు చేస్తోంది. ఇకపై ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ట్రైన్ టికెట్లు బుక్..
తిరుపతి వెళ్లే నాలుగు మెము రైళ్లు ఫిబ్రవరి 5వ తేది వరకు తిరుచానూరు వరకు మాత్రమే నడుస్తాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి. అరక్కోణం నుంచి తిరుపతికి ఉదయం 9.15 గంటలకు వెళ్లే రైలు తిరుచానూరు వరకు మాత్రమే వెళ్తుంది. మరుమార్గంలో, అరక్కోణం వెళ్లే మెము సాయంత్రం 3.40 గంటలకు తిరుచానూరు నుంచి బయల్దేరుతుంది.
మచిలీపట్నం - కొల్లం మధ్య కడప మీదుగా ప్రత్యేక వీక్లీ రైలు (నెంబర్ 07103/07104) నడపనున్నట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎ.జనార్దన్ తెలిపారు.
వందే భారత్ రైలు పది రోజుల్లోపు హిందూపురంలో ఆగుతుందని ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. హిందూపురానికి వచ్చిన ఆయన విలేకరలుతో మాట్లాడారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తాను రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నతో మాట్లాడామని తెలిపారు.