Home » Trains
నగరంలోని మెట్రో రైళ్లకు అదనపు కోచ్లు, కొత్త రైళ్లను ఇప్పట్లో తీసుకొచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఎల్అండ్టీ నుంచి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా తీసుకుంటున్న తరుణంలో అదనపు కోచ్ల ఏర్పాటు మరికొన్ని రోజుల పాటు ఆలస్యమయ్యేట్లు కనిపిస్తోంది.
పండగల సందర్భంలో చర్లపల్లి-దనపూర్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబరు23, 28తేదీల్లో చర్లపల్లి- దనపూర్(07049)రైళ్లు, 24,29 తేదీల్లో దనపూర్-చర్లపల్లి (07092) రైళ్లు, 26న చర్లపల్లి- దనపూర్ (07049), 27న దనపూర్-చర్లపల్లి (07050)ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు అధికారులు వివరించారు.
దీపావళి నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ వాసులు తమ స్వస్థలాల బాట పడుతున్నారు. దీంతో టీజీఎస్, ఏపీఎస్ ఆర్టీసీలతో పాటు ప్రైవేట్ బస్సులకు భారీ డిమాండ్ నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేటు బస్సుల టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి.
తొక్కిసలాటలో 10 నుంచి 15 మంది ప్రయాణికులు గాయపడటంతో వారిని హుటాహుటిన బర్ధమాన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురు మహిళలు పలువురు పురుషులు ఉన్నారు.
తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్కు బయల్దేరే రైలు, తిరుపతికి బదులు తిరుచానూరు నుంచి బయల్దేరనుంది. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... మరమ్మతు పనుల కారణంగా చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతికి వెళ్లే అన్ రిజర్వ్డ్ రైళ్ల సేవలో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది.
దేశంలో దీపావళి, ఛట్ పూజ పండుగల సీజన్ సమీపిస్తోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణీకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ గుడ్ న్యూస్ తెలిపింది.
మిర్యాలగూడలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ సోమవారం ఉదయం నిలిచిపోయింది. ఇంజిన్లో సాంకేతిక లోపంతో గంటకు పైగా ఆగిపోయింది ఫలక్నుమా.
సాధారణంగానే రైల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక పండుగ సమయాల్లో ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనరల్ కంపార్ట్మెంట్లో అడుగు తీసి, అడుగు పెట్టలేని విధంగా ఉంటుంది. అయినా చాలా మంది విధి లేక ఎంత కష్టమైనా అందులోనే ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలో..
ముజఫర్పూర్-హైదరాబాద్ (చర్లపల్లి) మార్గంలో కొత్తగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను రైల్వేశాఖ ప్రవేశ పెట్టింది. ఆరంభ స్పెషల్(05253)ను రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం వర్చువల్గా ప్రారంభించారు.
సికింద్రాబాద్-త్రివేండ్రం మధ్య నడుస్తున్న శబరి ఎక్స్ప్రెస్ మంగళవారం నుంచి సూపర్ ఫాస్ట్ రైలుగా మారనుంది. ప్రస్తుతం 17229/30 నంబర్లతో నడుస్తున్న శబరి ఎక్స్ప్రెస్ ఇకనుంచి 20629/30 నంబర్లతో పరుగులు పెట్టనుంది.