Home » TS News
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆదిలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి, తుమ్మల యుగంధర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పొంగులేటి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Telangana: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆదిలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘మీరంతా ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి. అది ఒక వ్యక్తి కోసం కాదు కాంగ్రెస్ విధానాలకు వేయండి. ఎంతమంది తిరుగుతుంటారు’’..
హైదరాబాద్లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడింది. చాకచక్యంగా కాలేజ్ బ్యాగులో డబ్బు పెట్టి బైక్పై తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కూకట్పల్లిలోని వసంత్ నగర్ బస్టాప్ వద్దకు అనుమానాస్పదంగా రెండు హీరో ఫ్యాషన్ ప్రో బైక్లపై వచ్చారు. వారు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకుని పోలీసులు సోదా చేయగా.. వారిలో ఒకరి వద్ద గల బ్లాక్ కలర్ కాలేజీ బ్యాగ్లో రూ. 53 లక్షల37 వేల500 లభ్యమయ్యాయి.
ఎన్నికలకు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇక ప్రచారాలు సైతం చివరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సవాల్గా తీసుకున్నాయి. ఈ రెండు పార్టీలు ఎక్కువ ఎంపీ సీట్లను గెలవాలనే లక్ష్యంతో పని చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు పార్టీలకు చెందిన అగ్ర నేతలంతా తెలంగాణలో సందర్శిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చివర దశకు చేరుకుంది. బీజేపీ అధిష్టానం అయితే తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ నుంచి కేంద్ర హో మంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్ర నేతలంతా తెలంగాణలో ఒకరి తర్వాత ఒకరు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎలాగైనా పెద్ద మొత్తంలో ఎంపీ సీట్లను రాబట్టుకోవాలని బీజేపీ అధిష్టానం పట్టుదలతో ఉంది.
Telangana: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విరుచుకుపడ్డారు. 25 లక్షల మందిని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళను పైకి తీసుకువచ్చామని మోదీ అంటున్నారని.. అదే నిజం అయితే ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నట్లు..? అని ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పుకోవడంలో విఫలం అవుతున్నామని చెప్పుకొచ్చారు.
Andhrapradesh: నగరంలోని భవన నిర్మాణ కార్మికులు బుధవారం ఉదయం సమావేశమయ్యారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని, టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పనులు లేక పస్తులు ఉన్న పరిస్థితి వివరిస్తూ కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. సీఎంగా జగన్ వచ్చాక భవన నిర్మాణ కార్మికులు కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నయా నాటకాలకు తెర లేపుతున్నారని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రఘు నందన్ రావు దుబ్బాకలో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా అని అన్నారు. పోలీసులతో డబ్బులు పంచి గెలిచినందుకు కేసీఆర్కు సిగ్గు ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు. వెంకట్ రాంరెడ్డి ఎన్ని కట్టలు కట్టించినందుకు మెదక్ సీటు ఇచ్చావ్ కేసీఆర్ అని నిలదీశారు.
వచ్చే పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మీట్ ది ప్రెస్లో కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జూన్ 5 న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారన్నారు. బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్లోకి వస్తామని తనను సంప్రదించారన్నారు.
Telangana: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేములవాడకు చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతూ... కాశీ నుంచి మోదీ దక్షిణ కాశీకి వచ్చారన్నారు. వేములవాడకు ఇంత వరకు ఏ ప్రధానీ రాలేదని తెలిపారు.