Home » TTD
Tirumala Donations: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. దాదాపు 10 కోట్లు విలువైన బంగారు ఆభరణాలను స్వామికి సమర్పించారు భక్తుడు.
టీటీడీ వివిధ ట్రస్టులకు అమెరికాలోని బోస్టన్లో నివసించే భాగవతుల ఆనంద్ మోహన్ రూ.1.40 కోట్ల విరాళాన్ని అందజేశారు. విరాళాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వీకరించి, విభిన్న ట్రస్టులకు సద్వినియోగం చేయాలని అభ్యర్థించారు.
Srivari Govinda Namalu: తిరుమల వేంకటేశ్వర స్వామిని భక్తులు ఎంతోమంది దర్శించుకుంటారు. శ్రీవారిని ఇష్టదైవంగా పలువురు కొలుస్తారు. వేంకటేశ్వర స్వామి గోవింద నామాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఈ నామాలను అభ్యంతరకరంగా ఓ చిత్రంలో వాడుకోవడంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని టీటీడీ ఇప్పుడు సీరియస్గా తీసుకుని చర్యలు చేపట్టింది.
Tirumala:వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు నెల రోజులుగా వీఐపీ సిఫారసు లేఖల్ని రద్దు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో సిఫారసు లేఖలు ఆమోదిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఆగిపోయిన ప్రత్యేక దర్శనాలను మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.
TTD: యువతకు టీటీడీ లక్కీ చాన్స్ ఇస్తోంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని నేరుగా దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మరి.. ఆ బంపర్ చాన్స్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
యుద్ధ ఉద్రిక్తతల భయంతో తిరుమలకు భక్తుల రాక సాధారణ స్థాయిలోనే ఉంది. వేసవి సెలవుల్లో కూడా క్యూకాంప్లెక్స్లు ఖాళీగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది
గంగ జాతరను పురస్కరించుకుని వేంకటేశ్వరస్వామి చెల్లెలుగా ప్రసిద్ధికెక్కిన తాతయ్యగుంట గంగమ్మకు టీటీడీ ఆనవాయితీగా అందజేసే మేల్చాట్, పసుపు, కుంకుమ (సారె) శనివారం సాయంత్రం ఆలయానికి చేరుకుంది.
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో 12మందిపై తొలి చార్జిషీటును సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. మరో పది రోజుల్లో రెండో చార్జిషీటు కూడా దాఖలయ్యే అవకాశం ఉంది
అలిపిరిలోని 35 ఎకరాల భూమిని టీటీడీ ఏపీ టూరిజం అథారిటీకి కేటాయించగా, పేరూరు గ్రామంలోని 10.32 ఎకరాలు సహా మొత్తం 35 ఎకరాలను టీటీడీకి బదలాయించాలని బోర్డు నిర్ణయించింది. ఈ భూకదలికకు సంబంధించి ప్రభుత్వాన్ని వేగంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాయనుంది
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు శుభవార్త చెప్పారు. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల కోసం ఎలక్ట్రిక్ బస్సులను ఉచితంగా నడపనున్నారు. ఈ వాహనాల్లో తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు యాత్రికులను తీసుకెళ్లాలని ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయించినట్లు సమాచారం.