Home » TTD
తిరుమల పరకామణి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మరోసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈకేసులో పలువురు అధికారులను విచారించిన అనంతరం ధర్మారెడ్డిని సీఐడీ మరోసారి విచారణకు పిలిచింది.
కలియుగ వైంకుఠ నాథుడు తిరుమల వేంకటేశ్వరస్వామిని ప్రపంచవ్యాప్తంగా భక్తులు పూజిస్తుంటారు. క్షణకాలమైనా నిత్య అలంకార ప్రియుడు శ్రీవారి దర్శనం దొరికితే చాలని భక్తులు భావిస్తుంటారు.
తమిళనాడు రాష్ట్రాని చెందిన ఓ వాహనంపై అన్యమత చిహ్నాలు ఉండటాన్ని గుర్తించారు. అయితే.. ఈ వాహనం అలిపిరి టోల్గేట్ దాటి తిరుమల కొండపైకి చేరుకోవడం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఒకరిని విధుల నుంచి తొలగించింది.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే టీటీడీలోని పలువురు ఉన్నతాధికారులను సిట్ విచారించింది. ఈ విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు.
పరకామణి చోరీ కేసుని ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ క్రమంలో కేసుపై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
తిరుమలలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల పేరుతో నకిలీ టీటీడీ టికెట్లు విక్రయిస్తున్న పలువురు వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కొన్ని రోజులకే మళ్లీ ఈ టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులే టార్గెట్ గా ఈ నకిలీ పత్రాలను విక్రయిస్తున్నారు.
శ్రీవారి భక్తులకు మళ్లీ టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెెట్లు ఎప్పుడు విడుదల చేసేది వివరించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలోకి ముడి సరుకులు చేర్చేందుకు నూతన బ్యాగ్ కన్వేయర్ (బ్యాగ్ స్టాగర్) అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా శ్రీవారికి సమర్పించే అన్నప్రసాదాలు, లడ్డూలు, వడలు, ఇతర ప్రసాదాలన్నీ సంప్రదాయం మేరకు శ్రీవారి ఆలయంలోని పోటు (కట్టెల పొయ్యితో కూడిన వంటశాల)లోనే తయారవుతాయి.
టీటీడీకి సంబంధించి కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ కేసులకు సంబంధించి తిరుపతిలో ముమ్మరంగా విచారణ జరుగుతోంది. ఒకవైపు సీఐడీ.. మరోవైపు సీబీఐ భాగస్వామ్యమున్న సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది.