Home » Twitter
Twitter bird logo: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్ ట్విట్టర్ ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను వేలం వేసింది. ఆక్షన్లో ఈ నీలి పక్షి ఎంత ధర పలికిందంటే..
సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్విటర్ 'పిట్ట' మనందరికీ తెలిసిందేకదా.. ఇప్పుడు సదరు పాత ట్విట్టర్ లోగో అయిన ఈ ఐకానిక్ బ్లూ బర్డ్ వేలం వేశారు. వేలంలో ఈ బుల్లి పిట్ట 35 వేల డాలర్లకు అమ్ముడుపోయింది. 'ఆర్ఆర్ ఆక్షన్' అనే సంస్థ నిర్వహించిన తాజా వేలంపాటలో ఈ ధర వచ్చింది.
ప్రముఖ కన్నడ హీరో ఉపేంద్ర నటించిన సూపర్ హిట్ సినిమా ఉపేంద్ర చూసే ఉంటారు. అందులో హీరో నేను ఫిల్టర్ లేకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటాడు. ఇష్టం వచ్చినట్లు చేస్తుంటాడు. ఇప్పుడు గ్రోక్ కూడా అలాగే కనిపిస్తోంది.
సామాజిక మధ్యమం ఎక్స్ సేవలు సోమవారం పలుమార్లు స్తంభించాయి. భారత్తో సహా ప్రపంచంలోని పలు దేశాల్లో ఎక్స్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
జమ్మూ కాశ్మీర్లో సోమవారం చోటు చేసుకున్న ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కు చెందిన వీర జవాన్ కార్తీక్ మృతి చెందారు. చిత్తూరు జిల్లా, బంగారువాండ్లపల్లె మండలం, ఎగువ రాగి మానుపెంటకు చెందిన కార్తీక్ ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి వీరమరణం చెందారు.
ఒకే రోజు నలుగురు రైతులను పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిదని.. రైతు రాజ్యం కాదిది.. రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదని, తోడేళ్ళలా ప్రాణం తీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిదని అన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన ఆరు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక మైలు రాళ్లను చేరుకుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కేవలం ఆరు నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో వైసీపీ ఐదేళ్ల పాలనకు మించి అభివృద్ధి చేసి చూపించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
ఇతర దేశాల రాజకీయ వ్యవహారాలపై గత కొన్ని వారాలుగా వరస వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ ఆయా దేశాలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ కుమారుడి కామెంట్స్ను తప్పుపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు..
ప్రశ్నించడమే నేరమా.. నిలదీయడమే పాపమా.. అని బాల్క సుమన్ అన్నారు. లగచర్ల, దిలావర్ పూర్, రైతుకు బేడీలు, విద్యార్థుల మరణాలు, గురుకుల సంక్షోభాలు.. ఇలా వీటన్నింటిపై కేటీఆర్ నిలదీస్తున్నందుకే కుట్రాలా అంటూ ఆయన ప్నశించారు.