Home » Uttar Pradesh
నరేంద్రమోదీ మరోసారి దేశ ప్రధాని కాలేరని, బీజేపీకి ఈ ఎన్నికల్లో 180కి మించి సీట్లు రావని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చెప్పారు. ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి తుఫాన్ రానుందని, దేశంలో బీజేపీ అతిపెద్ద ఓటమిని ఇక్కడే ఎదుర్కోనుందని తెలిపారు.
దేశంలో లోక్సభ ఎన్నికల నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు ఒకటే సీన్. ఆ యా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు.. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో తమ నామినేషన్ వేసేందుకు.. తమ అనుచరగణంతో కలిసి వెళ్తారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో రాయ్బరేలీ, అమేథీ ముందు వరుసలో ఉన్నాయి. గాంధీ కుటుంబానికి ఈ రెండు స్థానాలు ఎప్పటినుంచో సంప్రాదాయక సీట్లుగా ఉన్నాయి. కానీ 2019లో అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి చవిచూడగా.. రాయ్బరేలీలో సోనియాగాంధీ విజయం సాధించారు. ఈసారి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో.. రాయ్బరేలీ నుంచి ఆమె వారసుడిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది.
ప్రధాని మోదీ తన పదేళ్ల హయాంలో ఒక్క పథకాన్నైనా ప్రారంభించారా, ఒక్క సంస్థనైనా నెలకొల్పారా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ప్రశ్నించారు.
లిఫ్ట్లలో వెళ్తున్న సమయంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఊహించని విధంగా లోపలికి వచ్చే జంతువులు.. అనూహ్యంగా దాడులు చేస్తుంటాయి. ఇలాంటి ...
ప్రేమ పేరుతో కొందరు పెళ్లి పేరుతో మరికొందరు యువతులను మోసం చేయడం చూస్తూ ఉన్నాం. దీనిపై ప్రశ్నించిన వారిపై ఎదురుదాడులు చేస్తున్న ఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా..
వివాహేతర సంబంధాలు ఎన్నో అనర్ధాలకు దారితీస్తాయని, ప్రాణాలను సైతం బలిగొంటాయని చెప్పడానికి.. ఈ తాజా ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పరాయి వ్యక్తితో ఓ మహిళ పెట్టుకున్న వివాహేతర సంబంధం..
దేశంలో ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు రాహుల్గాంధీకి అగ్నిపరీక్షగా మారాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించనప్పటికీ.. కాంగ్రెస్ నాయకులు ఎక్కువమంది రాహుల్ ప్రధాని కావాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే రాహుల్ ప్రధాని కావాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఢిల్లీలో అధికారంలోకి రావాలంటే యూపీలో గెలవాలి. ఎవరిని అడిగినా ఇదే చెబుతారు. అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ ఎక్కువు సీట్లు గెలిస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారానికి దగ్గరవుతుందనేది వాస్తవం. దీంతో ఈ ఎన్నికల్లో యూపీలో సత్తా చాటేందుకు ఎన్డీయే, ఇండియా కూటములు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలుండగా.. మూడు విడతల పోలింగ్ ముగిసింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్లో గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గడం రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి.
తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ను పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తొలగిస్తున్నట్లు బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.