Home » Virat Kohli
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. పెర్త్, అడిలైడ్ మ్యాచ్ లో డకౌటైన కోహ్లీ .. సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో మాత్రం ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
కోహ్లీకి అక్టోబర్ 25 అస్సలు కలిసి రాదనే రికార్డు ఉంది. తన కెరీర్లో ఈ తేదీన ఆడిన వన్డేల్లో కోహ్లీ అత్యధిక స్కోర్ 30 పరుగులే. ఈ నేపథ్యంలో సిడ్నీలో ఈ ప్రతికూల రికార్డును కోహ్లీ ఎలా అధిగమిస్తామనేది ఆసక్తికరంగా మారింది..
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా చివరి వన్డే ఈ రోజు (శనివారం) జరగబోతోంది. తొలి రెండు మ్యాచ్లలో ఓటమి పాలైన టీమిండియా సిరీస్ను కోల్పోయింది. ఇక, క్లీన్ స్వీప్ అవమానం నుంచి తప్పించుకోవడం ఒకటే ఇప్పుడు టీమిండియా ముందున్న లక్ష్యం.
వరుసగా రెండు మ్యాచుల్లోనూ డకౌట్ కావడంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇక విరాట్ రిటైర్మెంట్కు వేళైందా? అనే సందేహాలూ అభిమానుల్లో వస్తున్నాయి.
గురువారం ఆస్ట్రేలియాతో భారత్ అడిలైడ్ వేదికగా రెండో వన్డే ఆడుతోంది. ఈ మ్యాచ్లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. అతను జీరో పరుగులు చేసినా ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ లభించింది. అతడు డకౌట్ అయినా.. ప్రేక్షకులంతా కింగ్కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత టీమిండియా దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో పాల్గొంటున్నారు. అయితే పెర్త్లో జరిగిన తొలి వన్డేలో ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు.
సుధీర్ఘ విరామం తర్వాత ఆసీస్ మ్యాచ్ తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపర్చాడు. తొలి మ్యాచ్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన కోహ్లీ డకౌట్గా వెనుదిరిగాడు. 8 బంతులాడి కోహ్లీ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో కూపర్ కొన్నోల్లీ స్టన్నింగ్ క్యాచ్కు పెవిలియన్ చేరాడు.
ఆదివారం పెర్త్ వేదికగా జరిగే తొలి వన్డేలో కోహ్లీ సెంచరీ చేస్తే.. ఈ అరుదైన రికార్డ్ తన ఖాతాలో పడనుంది. ప్రస్తుతం ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించిన కమర్షియల్ కాంట్రాక్ట్పై కోహ్లీ సంతకం చేయలేదనే ప్రచారం సాగుతోంది.
టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నారు. ఆస్ట్రేలియాతో ఈ నెలలో జరిగే వన్డే సిరీస్ కోసం బరిలోకి దిగబోతున్నారు. 2027 ప్రపంచకప్ వరకు వారు జట్టులో కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.