Home » Visaka
విశాఖపట్నం: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ తీవ్రస్థాయిలో విమర్ళలు గుప్పించారు. పవర్ ప్రాజెక్టులపేరుతో భూ సంతర్పణ చేశారని.. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోలార్ సంస్ధలకు భారీఎత్తున భూములు కట్టబెట్టారని ఆరోపించారు.
విశాఖ: ఈనెల13 న జరిగిన పోలింగ్ సరళి చూస్తే... ఓటర్లు కూటమికే పట్టం కట్టారని.. సంక్రాంతి పండగను తలపించే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి ఓట్లు వేసారని మాజీ మంత్రి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు.
విశాఖ: వైసీపీ గూండాలకు రోజులు దగ్గర పడ్డాయని, కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసిన వారిపై దాడులు చేస్తారా? ఫ్యామిలీ ఇష్యూ అంటూ పోలీసులు కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజక వర్గం కూటమి అభ్యర్ధి విష్టుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ: తూర్పు నియోజకవర్గం ప్రజలకు తాను ఎంతో చేశానని కూటమి అభ్యర్థి, టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. తాను చేయగలిగినంత సహాయం చేస్తానని.. మాటలతో మోసం చేయడం తెలియదని అన్నారు. గతంలో ఎలా ఉన్నా.. రేపు కూడా అలానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
ఎంపీగా గెలిచి... పార్లమెంట్లో తాను అడుగు పెడితే విశాఖపట్నం నగరాభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. లోక్సభ నియోజకవర్గ ప్రజలు.. తనను ఎంపీగా కోరుకుంటున్నారన్నారు.
విశాఖ: గాజువాక సభలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుపై రాళ్ల దాడి వెనుక వైసీపీ హస్తం ఉన్నట్లు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం రాత్రి సిఎం జగన్పై గులక రాయి దాడికి నిరసనగా.. చంద్రబాబుపై దాడి చేస్తామని వైసీపీ అభిమాని చక్రి ధర్మపురి ముందే చేసిన హెచ్చరిక వాట్సాప్ గ్రూపులో హల్ చల్ చేసింది.
విశాఖ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల కోడ్ను ఉల్లంఘించి వాలంటీర్లు అధికారపార్టీ కోసం ప్రచారంలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విశాఖ జిల్లా, భీమునిపట్నం మండలం, రాజుల తాళ్లవలసలో ఇటీవలే ఇద్దరు వాలంటీర్లను తొలగించారు.
విశాఖ: భీమిలీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు చేదు అనుభవం ఎదురైంది. పద్మనాభం మండలంలో అవంతి ప్రసంగానికి అడుగడుగునా స్థానిక మహిళలు, యువకులు అడ్డు తగిలారు. నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయలేదని, ఏ సమస్య పరిస్కరించలేదని స్థానికులు అవంతిని గట్టిగా నిలదీసారు.
విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను లెక్క చేయకుండా వాలంటీర్స్ను వైసీపీ వాడుకుంటోందని, పోలీసులు కూడా ఈసీ కోడ్ను లెక్క చెయ్యకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
విశాఖ జిల్లా: పెందుర్తి నేషనల్ హైవే వద్ద మంగళవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. గుణుపూర్ నుంచి హైదరాబాద్కు ఐరన్ స్క్రాప్ లోడుతో వస్తున్న లారీ పెందుర్తి జంక్షన్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ఎన్ శేఖర్ రెడ్డి (55) అక్కడికక్కడే మృతి చెందాడు.