Home » Visakhapatnam
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం గురువారం నాటికి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా పరిసరాల్లో కొనసాగుతోంది. దీని నుంచి ఛత్తీస్గఢ్, విదర్భ, మరట్వాడ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.
ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 200కుపైగా దొంగతనాలకు పాల్పడిన హైదరాబాద్ వాసి మహ్మద్ సలీమ్ ఖురేషి(51)ని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు.
International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీతో పాటుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని కేంద్ర ఆయూష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ అన్నారు. 5 లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఏపీ ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
Lokesh Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం చారిత్రక కార్యక్రమమని.. కమిట్మెంట్తో ప్రతీ ఒక్కరూ పని చేయాలని.. బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి లోకేష్ హితవు పలికారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని... ప్రజల వేడుక, అందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ...
Shining Stars Awards: పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారని.. పిల్లలు విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంటుందని హోంమంత్రి అనిత అన్నారు. పిల్లలకు చదువే భవిష్యత్తు, చదువే పెట్టుబడి అని చెప్పుకొచ్చారు.
విశాఖ రైల్వేస్టేషన్ అప్గ్రేడేషన్ జరుగుతుందని విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి భరత్ తెలిపారు. రైల్వే జోన్ పనులు వేగవంతంగా చేస్తున్నామని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో మార్పులు చేస్తున్నామని ఎంపీ భరత్ తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం పర్యటన వాయిదా పడింది. ఈ నెల పదో తేదీన నగరంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు.
రుతుపవనాలు మందగించడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేకపోవడంతో కోస్తాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. శనివారం కొన్నిచోట్ల వడగాడ్పులు వీచాయి.
Palla Simhachalam: ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు.