Home » YCP
ఐదేళ్ల పాలన చూశారు..! అంతకు మునుపు ఐదేళ్ల పాలనా చూశారు..! అరాచకాలకు, అభివృద్ధికి తేడాలను గమనించారు. మరో ఐదేళ్ల భవితకు పునాది వేసుకునేందుకు సిద్ధమయ్యారు. పోస్టల్ బ్యాలెట్లో పోటెత్తి ఓటేసి.. స్పష్టమైన సంకేతాలను పంపించారు. ఈవీఎంల మీట నొక్కేందుకు మరింత ఉత్సాహంతో సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు విజేతగా నిలిచే సమయం ఆసన్నమైంది. అభ్యర్థుల భవితవ్యం అటుంచితే.. ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే బాధ్యత ఓటరుదే. ‘తెల్లారింది లెగండోయ్.. కొక్కొరోక్కో..’ అంటూ.. ఓటేసేందుకు తాము వెళ్లడంతోపాటు.. ఇరుగూ పొరుగునూ తట్టిలేపి తీసుకెళ్లాలి. పోలింగ్ కేంద్రాలు కళకళలాడాలి. ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. భవితను మార్చుకోవాలి. అభివృద్ధికి బాటలువేసేవారిని గురిచూసి ఎన్నుకోవాలి. ...
రాష్ట్రంలో కూటమిదే అధికారం అని కొన్ని, మరోసారి వైసీపీదే అధికారమని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బెట్టింగ్ల జోరు పెరిగింది. పోలింగ్కు ముందే పందెంరాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపోటములపైనే ఎక్కువగా పందేలు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైబడి పందేలు కాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎంపీ అభ్యర్థులపైనా పందెం కాస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాల్లో..
జిల్లాలో పోలింగ్ నిర్వహణ పోలీసులకు సవాలు కానుంది. శాంతిభద్రతలకు విఘాతంగా కలగకుండా వారు ఏ మేరకు చర్యలు తీసుకోగలరనేది చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ నేతలు కుయుక్తులు పన్నుతున్నట్లు సమాచారం. ఎక్కడైనా తేడా కొడితే అల్లర్లు సృష్టించాలని కొందరు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. జిల్లాలోని రాప్తాడు, తాడిపత్రి, ఉరవకొండ నియోజకవర్గాలపైనే అందరి దృష్టి ఉంది. ఇక్కడ ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసేందుకు, ప్రలోభ పెట్టడానికి అనేక ..
వైసీపీ దుష్ప్రచారాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. టీడీపీ కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు లేని విషయాలను సైతం సృష్టించి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వస్తోంది. టీడీపీ కూటమికి..
మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు, పార్టీ నేతలు బిజీగా ఉండగా, మరికొందరు బెట్టింగుల్లో మునిగి తేలుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తోంది..? మెజార్టీ ఎంత ఉండనుంది..? మ్యాజిక్ ఫిగర్..? ప్రముఖుల బరిలో నిలిచిన చోట ఎవరు విజయం సాధిస్తారనే అంశాలపై రూ.కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది.
అనంతపురం జిల్లా: పెనుకొండ వైసీపీ అభ్యర్థి మంత్రి ఉషశ్రీ చరణ్.. భర్త చరణ్ రెడ్డి భాగోతం బట్టబయలైంది. బెంగళూరులో మేనమామ జగన్నాథ్కు చెందిన కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిని చరణ్ రెడ్డి కాజేసారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ అరాచకం ఒకటి వెలుగు చూసింది. నందిగామ మండలం కంచలలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు గొడవలు సృష్టిస్తున్నారని టీడీపీ చెబుతోంది. గ్రామంలో టీడీపీకి అనుకూలంగా ఉందని వైసీపీ మూకలు దాడికి దిగాయి.
తిరుపతి: ఎన్నికల సభలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి నోరు పారేసుకున్నారు. ఆంధ్రజ్యోతిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరి పేర్లు చెప్పి వారి అంతు చూస్తానని కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. దీంతో ఏపీయూడబ్ల్యూజే తిరుపతి జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలను ఖండించారు.
నీతి నిజాయితీతో... ప్రజలకు మేలు చేయాలనే తలంపు ఉన్న నాయకులను ఎన్నుకోవాలి
గోదారోళ్ల వెటకారమే వేరు. ఏదైనా ఉతికి ఆరేస్తారు. మాటలో మర్యాద తప్పరు. గురీ తప్పదు. ఎన్నికలప్రచారం రెండునెలలకుపైగానే రంజుగా సాగి చిన్నగా గూటికి చేరుకొంటోంది. దీంతో ఎన్నికలపైనా గోదావరి జిల్లాల్లో సెటైర్లు పేలుతున్నాయి.