Home » YCP
వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు టీడీపీ నేతల్ని కొడతాం, చంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కారుమూరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన జగన్ దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డికి సిట్ మూడోసారి నోటీసు జారీ చేసింది. మద్యం షాపులకు సరఫరా, లంచాల నెట్వర్క్ నిర్వహణలో కీలకంగా ఉన్నాడని ఆధారాలు లభించాయి. దీంతో బుధవారం విచారణకు రావాలంటూ సెట్ అధికారులు నోటీసు ఇచ్చారు.
వలంటీర్ ఉద్యోగాల పేరుతో యువతను వైసీపీ ప్రభుత్వం వంచించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. వేతనాల చెల్లింపులకు ప్రభుత్వ ఉత్తర్వులు లేవని, నియామక ప్రక్రియ అస్పష్టమని తెలిపారు
వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టులో మరోసారి షాక్ తగిలింది. ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు వంశీని జైలుకు తరలించనున్నారు.
శ్రీరామనవమి సందర్భంగా విరూపాక్షి స్వగ్రామం చిప్పగిరిలోని కొండావీధిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి రాములోరి కల్యాణం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే హోదాలో విరూపాక్షి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా విరూపాక్షి చేతికి వేద పండితులు మంగళసూత్రాన్ని ఇవ్వగా… ఆయన దానిని సీతమ్మ మెడలో కట్టేశారు.
అక్రమ మైనింగ్ కేసులో వైసీసీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హైడ్రామా కొనసాగుతోంది. పోలీసులకు సహకరిస్తానని.. విచారణకు వస్తానని చెబుతూనే పది రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. పోలీసుల తీరుపై కూటమి పార్టీల శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 8.21 Per జీఎస్డీపీ వృద్ధిరేటుతో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. తలసరి ఆదాయ వృద్ధిలో మూడోస్థానాన్ని సాధించినట్లు కేంద్రం తెలిపింది
వైసీపీ నేత అంజద్బాషా సోదరుడు అహ్మద్ బాషాను కడప తాలూకా పోలీసులు ముంబైలో అరెస్టు చేశారు. వివిధ క్రిమినల్ కేసుల నేపథ్యంలో ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి
ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు కోమ్మా కోటేశ్వరరావు సహా నలుగురు ఇంకా పరారీలో ఉన్నారు. వారు నేపాల్లో తలదాచుకొని పోలీసుల కదలికలను ఫోన్ ద్వారా తెలుసుకుంటున్నట్లు సమాచారం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ చేసినప్పటికీ ముస్లింల మతపరమైన స్వేచ్ఛపై ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. ఆమె అన్నారు, మైనార్టీల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది, కానీ కాంగ్రెస్ మరియు వైసీపీ వంటి పార్టీలు ఓట్లు కోసం డ్రామాలు చేసేవి