జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వచ్చే భూపాలపల్లి నియోజకవర్గం 2009లో కొత్తగా ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో మొగుళ్లపల్లి, చిట్యాల, భూపాలపల్లి, ఘన్పూర్, రేగొండ, శాయంపేట, కొత్తపల్లిగోరి మండలాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 2,08,242 ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,04,908 మంది పురుషులు, 1,03,333 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2018లో పోటీ ఎవరెవరి మధ్య? 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి ఎస్.మధుసూధనా చారిపై (ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ) 15,635 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వెంకట రమణా రెడ్డికి 69,918 ఓట్లు రాగా.. మధుసూధనా చారికి 53, 567 ఓట్లు వచ్చాయి. ఇక 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సిరికొండ మధుసూధన చారి తన సమీప ప్రత్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిపై (కాంగ్రెస్) 7,214 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మధుసూధనా చారికి 65,113 ఓట్లు పోలవ్వగా వెంకటరమణారెడ్డికి 57,899 ఓట్లు పడ్డాయి. ఇక 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి మధుసూధనా చారి(బీఆర్ఎస్) పై 11,972 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వెంకటరమణా రెడ్డికి 69, 570 ఓట్లు రాగా మధుసూధనా చారికి 57,598 ఓట్లు పోల్ అయ్యాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |