హైదరాబాదు జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాలలో చాంద్రాయణగుట్ట ఒకటి. 1978లో ఏర్పడిన ఈ నియోజకవర్గం.. గతంలో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత చాంద్రాయణగుట్ట నియోజకవర్గంగా మారిపోయింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,93,549 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 1,49,611 మంది, మహిళా ఓటర్లు 1,43,919 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ 1999 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఈయనే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ.. తన సమీప ప్రత్యర్థి ఖయ్యూంఖాన్ (ఎంబీటీ) పై 15,173 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం తరపున పోటీ చేసిన సిటింగ్ ఎమ్మెల్యే అయిన అక్బరుద్దీన్.. తన సమీప ప్రత్యర్థి ఖయ్యూంఖాన్ (ఎంబీటీ) పై 59,274 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అక్బరుద్దీన్కు 80,393 ఓట్లు రాగా, ఖయ్యూంఖాన్కు 21,119 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్.. తన సమీప ప్రత్యర్థి షహెజాది సయ్యద్ (బీజేపీ) పై 80,264 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో అక్బరుద్దీన్కు 95,341 ఓట్లు రాగా, షహెజాది సయ్యద్కు 15,078 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |