రాష్ట్ర రాజధాని నగర హైదరాబాద్ జిల్లాలో ఉన్న మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గోషామహల్ శాసన సభా స్థానం ఒకటి. ఈ శాసన సభ నియోజకవర్గం హైదరాబాద్ లోక్సభ పరిధిలోనికి వస్తుంది. బీజేపీకి చెందిన రాజా సింగ్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే 2022లో ఆయనను బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేయడంతో ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. ఈ నియోజక వర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,86,264. హైదరాబాద్ నగరంలోని గోషా మహల్, అఫ్జల్ గంజ్, అఘాపురా, ధూల్ పేట్, కోటి, సుల్తాన్ బజార్, మోజమ్ జాహీ మార్కెట్, బషీర్ బాగ్ మొదలైన ప్రాంతాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఈ నియోజక వర్గం ఏర్పాటైన తొలి పర్యాయంలో అంటే 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ముఖేష్ గౌడ్ గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2018లో బీజేపీ తరఫున పోటీ చేసిన రాజా సింగ్ గెలుపొందారు. 2018లో పోటీ ఎవరి మధ్య? 2018లో గోషా మహల్ నియోజకవర్గం నుంచి రాజసింగ్ 16 వేల పైచిలుకు మెజారీటీతో గెలుపొందారు. ఆయన 45 శాతం ఓట్లతో 61 వేల ఓట్లు సాధించారు. రెండో స్థానంలో నిలిచిన టీఆర్ఎస్ నాయకుడు ప్రేమ్ సింగ్ కేవలం 32.2 శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో కూడా ఈ నియోజక వర్గం నుంచి రాజా సింగ్ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగిన రాజా సింగ్ మొత్తం 59 శాతం ఓట్లు సాధించి దాదాపు 45 వేల భారీ మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ముఖేష్ గౌడ్ (కాంగ్రెస్) 29.2 శాతం ఓట్లు మాత్రమే సాధించారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |