Home » TOP NEWS
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి లోక్సభ నియోజకవర్గం నుంచి శుక్రవారంనాడు నామినేషన్ వేశారు. ఆయన వెంట సోనియాగాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, బావమరిది రాబర్ట్ వాద్రా హాజరయ్యారు.
సార్వత్రిక ఎన్నికల 4 వ విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పది రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మే 13 న పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 454 మంది పోటీ చేయనున్నారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 525 మంది పోటీ చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్ద సంఖ్యలో నేతలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవడంతో డీలా పడ్డ బీఆర్ఎస్ను మరింత నిరుత్సాహ పరిణామం ఎదురైంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
‘‘ మా నాన్నని నమ్మొద్దు’’ అంటూ తన కూతురు ముద్రగడ క్రాంతి భారత్ చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. ‘‘నా కూతురి వ్యాఖ్యలకు భయపడను. నా కూతురు నా ప్రాపర్టీ కాదు’’ అని ముద్రగడ పద్మనాభం అన్నారు. తన కూతురికి పెళ్లి అవ్వకముందు తన ప్రాపర్టీ.. పెళ్లి అయ్యాక అత్తగారి ప్రాపర్టీ అని వ్యాఖ్యానించారు.
పథకాల కొనసాగింపుపై జగన్ మళ్లీ పాత పాటే అందుకున్నారు. నరసాపురం సభలో జగన్ మాట్లాడుతూ.. పథకాలు కొనసాగాలంటే తనకు ఓటు వేయాలని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి ఓటు వేస్తే పథకాలకు ముగింపు పలుకుతారని తెలిపారు. పది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని.. గతంలో ఎన్నడూ జరగని.. చూడని విధంగా ఇంటికే మూడు వేల చొప్పున పెన్షన్లు ఇచ్చామన్నారు.
అందరి అంచనాలకు భిన్నంగా టీ20 వరల్డ్ కప్ 2024 ఆడబోయే భారత జట్టులో యువ సంచలన రింకూ సింగ్కి చోటు దక్కలేదు. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా, రింకూ సింగ్కి ఓదార్పునిచ్చేలా వ్యవహరించాడు. భారత జట్టు ఎంపికను సమర్థిస్తూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ నిన్న (గురువారం) ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు.
లోక్సభ ఎన్నికలు-2024కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. పార్టీ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘ఇందిరమ్మ రాజ్యం.... ఇంటింటా సౌభాగ్యం’ పేరిట విడుదల చేసింది. మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్, దానం నాగేందర్, రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను జూలైలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఓటుకి నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలన్న పిటిషన్పై కౌంటర్ను సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం ఫైల్ చేయలేదు. గత విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం , ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.
కాపు నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంపై ఆయన కూతురు ముద్రగడ క్రాంతిభారతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పిఠాపురలంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత కోసం ముద్రగడ ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలో ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో గెలిచి, పవన్ కల్యాణ్ను తన్ని తరిమేస్తానని అహంకారంతో మాట్లాడారు. పిఠాపురంలో వంగ గీత గెలవకుంటే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఆ వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం కూతురు ముద్రగడ క్రాంతి భారతి స్పందించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసును ఢిల్లీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. నిన్నటి నుంచి ఢిల్లీ పోలీసుల బృందం హైదరాబాద్లోనే మకాం వేసింది. ఈ రోజు మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.