Share News

వైభవంగా మల్లేశ్వరస్వామి రథోత్సవం

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:11 AM

పట్టణంలో మల్లేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

వైభవంగా మల్లేశ్వరస్వామి రథోత్సవం
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

ఉరవకొండ, ఏప్రిల్‌ 23: పట్టణంలో మల్లేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. స్వామివారి మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై అధిష్టింపచేశారు. రథాన్ని చాబాల రోడ్డు వరకూ లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు. మండలంలోని రాకెట్ల గ్రామంలో మంగళవారం సుంకలమ్మదేవి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Updated Date - Apr 24 , 2024 | 12:11 AM