Home » Andhra Pradesh » Ananthapuram
అనంతపురం జిల్లా: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి రౌడీయిజం ప్రదర్శించారు. అర్ధరాత్రి తోపుదుర్తి గ్రామంలో తన అనుచరులతో అలజడి రేపారు. తోపుదుర్తి గ్రామంలో టీడీపీ నేత బోయ లింగమయ్య, ఉరుముల వన్నూరుప్ప ఇంటిపై దాడి చేశారు.
ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే డబ్బు,మద్యం అక్రమ రవాణాను నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మడకశిర నియోజకవర్గం పూర్తిగా కర్ణాటక సరిహద్దు ప్రాంతం. దీంతో కర్ణాటక నుంచి మద్యం అక్రమ రవాణా ఇక్కడ సర్వసాధారణం. ఎన్నిల నోటిఫికేషన వెలువడినప్పటి నుంచి మరింత ఎక్కువైనట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. నిఘా బృందాల పర్యవేక్షణ అంతంతమాత్రమే ఉందని ప్రజలు వాపోతున్నారు. సార్వత్రిక ఎన్నిల నోటిఫికేషన మార్చి16 వెలువడింది. అప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.
మైనార్టీలకోసం వైసీపీ నాయకులు చెప్పే మాటలు నమ్మకండని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ అన్నారు. ఆయన శనివారం హిందూ పురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రహమతపురం ప్రాంతంలో పర్యటించి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి, ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణకు ఓటేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా మైనార్టీలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
నల్లచెరువు, ఏప్రిల్ 27: మండలంలోని పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు ఆలయంలోని మూలవిరాట్కు పలు అభిషేకాలు, అలంకరణలు చేశారు. అనంతరం అర్చనలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుని పూజలు చేయించారు.
రొళ్ల-అగళి ప్రయాణించే ఆర్టీసీ బస్సు హొట్టేబెట్ట వద్ద హైవేపై శనివారం ఆగిపోయింది. తిరిగి స్టార్ట్ కాకుండా మొరాయించింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇక విధిలేని పరిస్థితుల్లో అది స్టార్ట్ అయ్యే వరకు దానిని తోయాల్సి వచ్చింది.
ముదిగుబ్బ, ఏప్రిల్ 27: మండలంలోని మలకవేముల క్రాస్లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్టవర్ ఎక్కి హల్చల్ చేసినట్లు పట్నం పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు.. మలకవేముల క్రాస్లో సమీప ఇళ్లల్లోని వారు ఒకరికొకరు తరచూ గొడవలు పడేవారు. కాగా శనివారం ఉదయం నాగరాజు నాయక్ అనే వ్యక్తికి పక్కింటి వాళ్లతో గొడవ జరిగింది. ఈ క్రమంలో పక్కింటి వాళ్లు పోలీ్సస్టేషనలో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.
వైసీపీ అధినేత, సీఎం జగన విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో ‘కొత్త సీసాలో పాత సారా’ అని జనం పెదవి విరుస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫేస్టోనే మళ్లీ విడుదల చేయడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఏదో ఉంటుందని ఆశించిన వైసీపీ అభ్యర్థులు మరింత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన బటన నొక్కుడుకే ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధిని మరిచారు. ఇదే అంశం అభ్యర్థులను భయపెడుతోంది. ప్రజలకు ఏం చెప్పి ఓట్లు ...
నల్లమాడ, ఏప్రిల్ 27: మం డలకేంద్రంలోని ఎస్సీ కాలనీలో మురుగునీరు రోడ్లపై పారుతుండడం వ ల్ల దుర్గంధం, దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండడంపై శనివారం ఆంధ్రజ్యోతి ది నపత్రికలో దుర్గంధం-దోమల బెడ ద అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది.
సమగ్రశిక్ష ప్రాజెక్టులో ఓ ఉన్నతాధికారి బరితెగించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఖాతరు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. బుక్కరాయసముద్రంలోని శిక్షణా కేంద్రానికి ఓ కంప్యూటర్ ఆపరేటర్ను అనామతుగా తీసుకున్నారు. ఉద్యగం భర్తీ పేరిట దరఖాస్తు కూడా స్వీకరించారని విశ్వసనీయ సమాచారం. ‘కలెక్టర్కు మనం ఎంత చెబితే అంత..’ ...
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మడకశిర అభ్యర్థి ఎంఎస్ రాజుకు నియోజకవర్గ ప్రజలు బ్రహర్మరథం పట్టారు. ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో కలిసి ఆయన మండలంలోని హొట్టేబెట్ట, కొత్తపాళ్యం, టీడీ పల్లి, జీజీ హట్టి, అగ్రహారం, మల్లినమడుగు, ఎం రాయాపురం, బీజీ హళ్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు ప్రతి గ్రామంలో హారతులతో ఘనస్వాగతం పలికారు. మల్లసముద్రం గ్రామంలో కార్యకర్తలు యాపిల్ పండ్ల గజమాలతో సత్కరించారు.