నీలకంఠేశ్వరుడి రథోత్సవం
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:27 AM
మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో వెలసిన నీలకంఠేశ్వరస్వామి బ్రహ్మరథోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది.
ఘనంగా నీలకంఠేశ్వరుడి రథోత్సవం
మడకశిర రూరల్, ఏప్రిల్ 19: మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో వెలసిన నీలకంఠేశ్వరస్వామి బ్రహ్మరథోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. వేదపండితులు ఆలయంలోని స్వామి వారి ఉత్సవ విగ్రహాలను మోసుకొని వచ్చి రథంపై ఆశీసులను చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని లాగారు. రథోత్సవం ఎదుట మహిళలు నిర్వహించిన కోలాటం లో మాజీ మంత్రి రఘువీరారెడ్డి పాల్గొని ఎంతో ఉత్సహంగా కోలాటం ఆడారు. అదే విధంగా తప్పెట్లు వా యించి అంద రినీ ఆనందిం పజే శారు. రథోత్సవంలో రఘువీరారెడ్డి దంపతులు, కు టుంబ సభ్యులు పాల్గొన్నారు వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.