టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్తు
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:41 AM
నారా చంద్రబాబునాయుడితోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కూటమి శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ పేర్కొన్నారు.
గార్లదిన్నె, ఏప్రిల్ 27 : నారా చంద్రబాబునాయుడితోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కూటమి శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ పేర్కొన్నారు. శనివారం గార్లదిన్నె, పెనకచెర్ల, కొత్తపల్లి గ్రామాల్లో ద్విసభ్య కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, సోదరి కిన్నెరలో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలను దోచుకుంటున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపి చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గుర్రం ఆదినారాయణ, గేటుక్రిష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ నాగరాజు, ఇల్లూరు రామాంజి, గుత్తాబాలకృష్ణ, నరసింహారెడ్డి, చితంబరప్ప, జయరాం, సుంకన్న, రామచంద్ర, గుర్రంశీనా, వడ్లరాము, బాబయ్య, అంజి, చిరుత క్రిష్ణారెడ్డి, గోరకాటి వెంకటేసు, రామకృష్ణ, గుత్తాహరి, సామల మధు, చల్లారాజు, కొడిదల శీనా, చలపతి, నలపరెడ్డి పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో ప్రచారం
నార్పల : నార్పల మండలంలోని నడిమిదొడ్డి గ్రామంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిట్టురంగారెడ్డి, ఆకుల నాగార్జున నాయుడు, చంద్రబాబు, లక్ష్మీనాయుడు, తిప్పన్న, జాఫర్, రాజన్న, పీఎల్ లక్ష్మీనారాయణ, తలారి కుళ్లాయప్ప, చంద్రమోహనరెడ్డి పాల్గొన్నారు.
శింగనమల : తరిమెలలో కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు బండారు శ్రావణిశ్రీ, అంబికా లక్ష్మినారాయణ తరఫున టీడీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడి, విజయ్కూమార్, సంజావ రాయుడు, నారాయణస్వామి. ఖాదర్వలి, చిరంజీవి పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం...