Share News

టీడీపీతోనే మైనార్టీల సంక్షేమం: కందికుంట

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:55 AM

కదిరిఅర్బన, ఏప్రిల్‌ 19: మైనార్టీల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. పట్టణంలోని

 టీడీపీతోనే మైనార్టీల సంక్షేమం: కందికుంట

కదిరిఅర్బన, ఏప్రిల్‌ 19: మైనార్టీల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. పట్టణంలోని షాలీమార్‌ ఫం క్షనహాల్‌లో శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ ఏర్పాటు చేసిన మైనార్టీల ఆత్మీయ సమావేశంలో కందికుంట పాల్గొని మాట్లాడారు. మైనార్టీల సంక్షేమానికి కృషి చేసింది టీడీపీనేనన్నారు. రంజానతోఫా, ఇమామ్‌, మౌజన్లలకు గౌరవ వేతనం, మసీదుల మరమ్మతులకునిధులు, పెళ్లికానుక, విదేశీ విద్య, షాదీఖానాల నిర్మాణం లాంటి అనేక కార్యక్రమాలు టీ డీపీ పాలనలోనే జరిగాయన్నారు. జగన పాలనలో మైనార్టీలు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే మైనార్టీ పథకాలు మళ్లీ కొనసాగుతాయని పేర్కొన్నారు. అనంతరం స్థానిక 10వార్డుకుచెందిన వైసీపీ మైనార్టీ నాయకులు టీడీపీలోకి చేరారు. వీరికి కందికుంట కడువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చేరినవారిలో సయ్యద్‌మౌలాలి, ఫిరోజ్‌, రహీమ్‌, షాజహాన, జునైద్‌, షామీర్‌బాషా, ఆయిషా, నూర్జహానతోపాటు పదిమంది ఉన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పవనకుమార్‌రెడ్డి, నాయకులు ఎస్‌. బాహుద్దీన, ఖాదర్‌బాషా, డైమండ్‌ ఇర్షాన, ఫయాజ్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:55 AM