Share News

వైసీపీ నుంచి 700మంది జనసేనలో చేరిక

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:03 AM

అప్పనరామునిలంక గ్రామంలో శుక్రవారం మాజీ సర్పంచ్‌ బర్రే శ్రీను ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు సంబంధించిన వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు.

వైసీపీ నుంచి 700మంది జనసేనలో చేరిక

అంతర్వేది, ఏప్రిల్‌ 19: అప్పనరామునిలంక గ్రామంలో శుక్రవారం మాజీ సర్పంచ్‌ బర్రే శ్రీను ఆధ్వర్యంలో రాజోలు నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు సంబంధించిన వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మహిళలు, యువకులు, నాయకులతో పాటు ఎస్సీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన వారితో 700మంది జనసేన పార్టీ సిద్ధాంతలు నచ్చి పార్టీలో చేరారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అభ్యర్థి దేవ వరప్రసాద్‌ సమక్షంలో చేరికలు జరిగాయని, ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించి వైసీపీకి బుద్ధి చెపుతామని బర్రే శ్రీను అన్నారు. రాజోలు కూటమి అసెంబ్లీ అభ్యర్థి దేవ వరప్రసాద్‌తో పాటు నర్సాపురం కూటమి అసెంబ్లీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్‌ ఈచేరిక సమావేశానికి హాజరై నాయకులతో మాట్లాడారు.

Updated Date - Apr 20 , 2024 | 01:03 AM