అన్నివర్గాల ప్రజల ఆర్థిక పురోభివృద్ధికి పాటుపడతా
ABN , Publish Date - Apr 28 , 2024 | 01:35 AM
వైసీపీఅరాచక పాలనతో తీవ్రంగా నష్టపోయిన అన్నివర్గాల ప్రజల ఆర్థిక పురోభివృద్ధికి, అభ్యున్నతికి పాటుపడతానని కొత్తపేట అసెంబ్లీ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు.
రావులపాలెం, ఏప్రిల్27: వైసీపీఅరాచక పాలనతో తీవ్రంగా నష్టపోయిన అన్నివర్గాల ప్రజల ఆర్థిక పురోభివృద్ధికి, అభ్యున్నతికి పాటుపడతానని కొత్తపేట అసెంబ్లీ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. మండలంలోని రావులపాడు, లక్ష్మీపోలవరం గ్రామాల్లో శనివారం ఆయన ప్రజాగళం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార రథంపై పర్యటిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేయబోయే అభివృద్ధిని ప్రజలకు వివరించారు. గ్రామాల్లో బండారుకు నాయకులు స్వాగతం పలకగా మహిళలు దిష్టితీసి హారతులు ఇచ్చారు. జగన్ అరాచక పాలనకు చరమగీతంపాడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు కంకణం కట్టుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మారుమూల ప్రాంతాలతో పాటు ప్రఽధాన గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి చేస్తానన్నారు.