Share News

చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:37 AM

టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, జగన్‌ ఐదేళ్లపాలన పేదలను కష్టాల్లో ముంచేసిందనిఅమలాపురం అసెంబ్లీ కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు అన్నారు.

చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

అల్లవరం, ఏప్రిల్‌27:టీడీపీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, జగన్‌ ఐదేళ్లపాలన పేదలను కష్టాల్లో ముంచేసిందనిఅమలాపురం అసెంబ్లీ కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు అన్నారు. శనివారం ఆయనటీడీపీ లోక్‌సభ అభ్యర్థి గంటి హరీష్‌మాధుర్‌తో కలిసి టీడీపీ మండల శాఖ అధ్య క్షుడు దెందుకూరి సత్తిబాబురాజు ఆధ్వర్యంలో కొమరగిరిపట్నంలో ఎన్నికల ప్రచారం చేశారు. టీడీపీలో చేరిన వారికి ఆనందరావు పార్టీ కండువాలుకప్పి ఆహ్వానించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు, మంతెన సురేష్‌రాజు, దాట్ల గోపీరాజు, గుర్రం ఏసుబాబు, ఎన్‌.సుబ్బరాజు, పరసా కిరణ్‌, వేగిరాజు వెంకట్రాజు, ఎంపీటీసీ ఎం.శ్రీనివాస్‌, జనసేన నాయకులు పిండి గణపయ్య, కంకిపాటి వీరబాబు, దంగేటి శ్రీహరి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 01:37 AM