జనసేన కార్యాలయంలో కిరణ్కుమార్రెడ్డి సమావేశం
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:46 PM
రాజంపేట పార్లమెంటు జనసేన నాయకులు యల్లటూరి శ్రీనివాసరాజు కార్యాలయంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో గురువారం రాజంపేట బీజేపీ పార్లమెంటు అభ్యర్థి మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సమావేశమయ్యారు
రాజంపేట టౌన, ఏప్రిల్ 25 : రాజంపేట పార్లమెంటు జనసేన నాయకులు యల్లటూరి శ్రీనివాసరాజు కార్యాలయంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో గురువారం రాజంపేట బీజేపీ పార్లమెంటు అభ్యర్థి మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనతో పాటు రాజంపేట పార్లమెంటు పరధిలోని ఏడు నియోజకవర్గాల కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధులను గెలిపించాలన్నా రు. కార్యకర్తలను ఆయన పరిచయం చేసుకున్నారు. జనసేన నాయకులు యల్లటూరి శ్రీనివాసరాజు, బీజేపీ పార్లమెంటు అధ్యక్షులు సాయిలోకేష్, రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్నాయుడు తదితరులు ప్రసంగిస్తూ కూటమి అభ్యర్ధుల విజయానికి తమవంతు కృషి చేస్తామన్నారు.