కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:50 PM
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
నిమ్మనపల్లి, ఏప్రిల్ 18: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. గురువారం తవళం గ్రామంలో జయహో బీసీ కార్యక్రమాన్ని ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు మాట్లాడూతూ బీసీలకు చట్ట సభలలో ప్రాముఖ్యత కల్పించిన ఘనత చంద్ర బాబునా యుడుదేనన్నారు. ప్రస్తుతం బీసీల కొర కు టీడీపీ 50ఏళ్లకే పింఛనను ప్రవేశపెట్టిందన్నారు. మే13న జరిగే ఎన్నికల్లో మదనపల్లె ఎమ్మెల్యేగా అభ్యర్థి షాజహనబాషాకు సైకిల్ గుర్తుకు, ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయా లని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నేత ఆర్జే వెంకటేష్, మాజీ మండల అధ్యక్షుడు రాజన్న, నాగయ్య, రమణ, జయమ్మ, శ్రీనివాసులరెడ్డి, శ్రీపతి, మహమ్మద్రఫి, శంకర పాల్గొన్నారు.