Share News

ప్రజాస్వామ్యస్ఫూర్తితో ఓటేయండి

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:27 AM

ఓటు హక్కు ఉన్నవారంతా ప్రజాస్వామ్యస్ఫూర్తితో ఓటేయాలని ప్రజలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దిల్లీరావు, విజయవాడ పార్ల మెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయపరిశీలకుడు వి.జస్టిన్‌, విజయవాడ పశ్చిమ, సెంట్రల్‌, తిరువూరు, మైలవరం ఎన్నికల వ్యయ పరిశీలకుడు సౌరభ్‌శర్మ, విజయ వాడ తూర్పు, నందిగామ, జగ్గయ్యపేట ఎన్నికల వ్యయ పరిశీలకుడు మదన్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యస్ఫూర్తితో ఓటేయండి
ఓటర్లను జాగృతం చేసే పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు వి.జస్టిన్‌, సౌరభ్‌శర్మ, మదన్‌కుమార్‌, కలెక్టర్‌ దిల్లీరావు

ఓటర్లకు ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల అధికారుల పిలుపు

కృష్ణలంక, ఏప్రిల్‌ 19: ఓటు హక్కు ఉన్నవారంతా ప్రజాస్వామ్యస్ఫూర్తితో ఓటేయాలని ప్రజలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దిల్లీరావు, విజయవాడ పార్ల మెంటరీ నియోజకవర్గ ఎన్నికల వ్యయపరిశీలకుడు వి.జస్టిన్‌, విజయవాడ పశ్చిమ, సెంట్రల్‌, తిరువూరు, మైలవరం ఎన్నికల వ్యయ పరిశీలకుడు సౌరభ్‌శర్మ, విజయ వాడ తూర్పు, నందిగామ, జగ్గయ్యపేట ఎన్నికల వ్యయ పరిశీలకుడు మదన్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్‌ దిల్లీరావు ఆధ్వర్యంలో ఓటర్లను జాగృతం చేసే పోస్టర్లను వారు ఆవిష్కరించారు. పట్టణ ప్రాంతాల ఓటర్లు మే 13న తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ పి.సంపత్‌కుమార్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, డీఆర్వో వి.శ్రీనివాసరావు, డీసీపీలు అధిరాజ్‌సింగ్‌రాణా, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 01:36 AM