Home » Andhra Pradesh » Krishna
ఎన్టీఆర్ జిల్లా మొత్తంగా 17,04,077 మంది ఓటర్లు నమోదయ్యారు. ఓటర్ల తుది జాబితా వివరాలను జిల్లా యంత్రాంగం శనివారం విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా, నామినేషన్ల స్ర్కూటినీ వరకు కొత్త ఓటర్ల నమోదుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 2024, జనవరి 22న విడుదల చేసిన డ్రాఫ్టు ఓటర్ల జాబితా ప్రకారం ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 16,74,995 మంది ఓటర్లు నమోదయ్యారు.
ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా.. ట్రాక్టర్ డ్రైవర్ల ప్రాణాలు పోతున్నా.. బందరు మండలంలో మట్టిమాఫియా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయట్లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా పోతేపల్లి గ్రామ పరిధిలో రోడ్ కం రైలు మార్గాల కోసం రైతులు విక్రయించిన భూముల నుంచి మట్టిని తవ్వి ఇష్టానుసారంగా విక్రయించేస్తున్నారు. రాత్రిపూట గుట్టుగా జరుగుతున్న ఈ బాగోతం శనివారం ఓ ట్రాక్టర్ డ్రైవర్ మృతితో వెలుగులోకి వచ్చింది.
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై రెండు జిల్లాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే రాజధాని అమరావతిని అనాథను చేసిన వైసీపీ సర్కార్.. మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలన ఉంటుందని చెప్పడంపై రాజధాని వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రూ.500 పెన్షన్ పెంపును ఐదేళ్లకు రూ.250 చొప్పున పెంచుతామని చెప్పడంపై పింఛన్దారులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది ఎన్నికల మేనిఫెస్టోలా లేదని, ఓటమిని ఒప్పుకొనే అంగీకారం పత్రంలా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు.
ఏళ్లు గడుస్తున్నాయి.. ఎన్నికలు వస్తున్నాయి.. పోతున్నాయి.. బందరు పోర్టు నిర్మాణం కూడా మొదలవుతుంది అనుకునేలోపే దూరమవుతోంది.. ప్రతి ఎన్నికలకు రాజకీయ పార్టీలకు ఇదొక అస్త్రమైతే అవుతోంది కానీ, శాశ్వతం మాత్రం కావట్లేదు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో 2015లో మచిలీపట్నంలో పర్యటించిన జగన్ తాము అధికారంలోకి వచ్చాక పటిష్టంగా పోర్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పటిష్టత మాట పక్కనపెడితే.. ఎన్నికలకు ముందు హడావిడిగా పనులు ప్రారంభించిన జగన్ మేజర్ పోర్టును కాస్త మైనర్గా మార్చారు. 16 బెర్తుల నుంచి 4 బెర్తులకు కుదించారు. రాష్ట్ర ఖజానా నుంచి రూపాయి విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రుణంతో మమ.. అనిపిస్తున్నారు. పనులైతే ప్రారంభమయ్యాయి కానీ, పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో బందరు వాసుల చిరకాల కల ఈసారి కూడా సముద్రంలో కలిసిపోయింది. - మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి
రానున్న ఎన్నికల నేపథ్యంలో, సంఘ విద్రోహ శక్తులను నిర్మూలించే దిశగా వన్టౌన్, గవర్నరుపేట పోలీస్స్టేషన్ల పరిధుల్లో శనివారం ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు.
నీటి కాసులతో శాశ్వతంగా అంధత్వం ప్రాపిస్తుందని, ప్రారంభ దశలోనే నీటి కానులను గుర్తిస్తే అంధత్వ నివారణ అత్యంత సులువని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ కె. శైలజ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంలో అమలు చేస్తున్న ప్యాకేజీ విధానం వల్ల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ఎలాంటి లాభం ఉండడం లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్(ఆష) స్పష్టం చేసింది. ఈ పథకంలో రోగుల భాగస్వామ్యం, బీమా విధానాలను ప్రవేశపెడితే అటు రోగులకు, ఇటు ఆసుపత్రులకు ఉపయోకరంగా ఉంటుందని అభిప్రాయపడింది.
ఎన్నికలు సజావుగా నిర్వహించాలంటే ఈవీఎంలం పనితీరుపై సెక్టార్ అధికారులు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జెడ్పీ కన్వెన్షన్హాలులో శనివారం సెక్టార్ అధికారులకు ఈవీఎంల కమీషనింగ్ అంశంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా శనివారం జిల్లా ఎన్నికల యంత్రాంగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 332 నామినేషన్లలో 106 నామినేషన్లు ఆమోదం పొందాయి. మిగిలిన వాటిలో 70 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇంకా 156 నామినేషన్లు అదనపు సెట్లుగా రావటంతో పక్కన పెట్టారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం గణాంకాలను విడుదల చేసింది.
జిల్లాలో ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయని, ఇక్కడ సమర్థవంతమైన బృందాలు పనిచేస్తున్నాయని, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు సమాచారం, నిఘా ఆధారిత ఎన్ఫోర్స్మెంట్ కీలకమని ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల పరిశీలకులు పేర్కొన్నారు.