Share News

టీడీపీతోనే సమగ్రాభివృద్ధి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:11 AM

రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని, ప్రజలు నమ్మారని, అందులో భాగంగా ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

టీడీపీతోనే సమగ్రాభివృద్ధి
జిల్లెల్ల గ్రామంలో ప్రచారం చేస్తున్న శబరి, ఫరూక్‌

గోస్పాడు, ఏప్రిల్‌ 27: రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని, ప్రజలు నమ్మారని, అందులో భాగంగా ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల అసెంబ్లీ అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. మండలంలోని జిల్లెల్ల గ్రామంలో శనివారం పర్యటించారు. టీడీపీ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లెల్ల గ్రామంలోని సమస్యలన్నిం టినీ పరిష్కరిస్తామన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు తులసీశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్‌ ఈశ్వరరెడ్డి, సదాశివారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, చిన్న నరసింహారెడ్డి, గోపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వీరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల (నూనెపల్లె): ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో దోపిడీ, దౌర్జన్యాలు, అరాచ కాలు దోచుకోవడమే జరిగాయని నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ ఎంపీ అభ్యర్ధి బైరెడ్డి శబరి, నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్ధి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. శనివారం పద్మావతి నగర్‌లోని కాటన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అఽఽధ్యక్షుడు నెరవాటి నందబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. శబరి, ఫరూక్‌ ముఖ్య అతిఽధులుగా హాజరై ప్రసంగించారు. నందబాబుతో సహా ఆయన కుటుంబ సభ్యులు, 50 మంది టీడీపీలో చేరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసి రెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ గంగిశెట్టి విజయకుమార్‌ తదితరలు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:12 AM