అహోబిలంలో ఏకాదశి పూజలు
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:33 AM
అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో శుక్రవారం ఏకాదశి పూజలను వేదపండితులు నిర్వహించారు.
నంద్యాల, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో శుక్రవారం ఏకాదశి పూజలను వేదపండితులు నిర్వహించారు. విశ్వరూప సేవ అనంతరం ఉత్సవమూర్తులైన ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వేకువ జామున్నే ఏకాదశి పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.