Share News

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:51 PM

అప్పుల బాధ తాళలేక ఆదోనిలో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

బైచిగేరిలో విషాదం

ఆదోని రూరల్‌, ఏప్రిల్‌ 19 : అప్పుల బాధ తాళలేక ఆదోనిలో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని బైచిగేరికి చెందిన వడ్డె రామాంజి (47) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రామాంజికి ఎకరా పొలం ఉంది. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ నిమిత్తం 20 సంవత్సరాలుగా గ్రామానికి చెందిన రైతుల వద్ద పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో పంటల సాగు కోసం రూ.5లక్షలకు పైగా అప్పులు చేశాడు. వాతావరణ పరిస్థితుల కారణంగా పంట చేతికందలేదు. దీనికి తోడు రుణదాతల నుంచి ఒత్తిళ్లు అధికం అయ్యాయి. ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోయిన రామాజి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. గురువారం అర్ధరాత్రి దాటాక పంటలకు వినియోగించే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఉరుకుందమ్మ ఫిర్యాదు మేరకు ఆదోని తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:51 PM