Share News

ప్రశాంతంగా పాలిసెట్‌

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:09 AM

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు పాలిసెట్‌-2024 అర్హత ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగింది.

ప్రశాంతంగా పాలిసెట్‌

నంద్యాల (నూనెపల్లె), ఏప్రిల్‌ 27: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు పాలిసెట్‌-2024 అర్హత ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 18 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 5,476 మంది విద్యార్ధులకు గాను 4,857 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకాగా, 619 మంది విద్యార్ధులు గైర్హాజరైనట్లు జిల్లా కోఆర్డినేటర్‌ శ్రీనివాస ప్రసాద్‌ తెలిపారు. మొత్తం జిల్లాలో 88.07 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు.

Updated Date - Apr 28 , 2024 | 12:09 AM