Share News

టీడీపీ అభ్యర్థుల వినూత్న ప్రచారం

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:10 AM

టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం కనిగిరిలో వినూత్నంగా ప్రచారం నిర్వహించారు.

టీడీపీ అభ్యర్థుల వినూత్న ప్రచారం
కనిగిరిలో స్కూటీపై వెళ్తున్న మాగుంట, ఉగ్ర

స్కూటిపై వెళ్లి ప్రజలతో మమేకం

కనిగిరి, ఏప్రిల్‌ 27 : టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం కనిగిరిలో వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. కొద్దిసేపు స్కూటీపై, మరికొద్దిసేపు సైకిల్‌పై ఇద్దరూ పర్యటించారు. ఈసందర్భంగా స్థానికులతో మమేకమయ్యారు. వారితో కొద్దిసేపు సరదాగా గడిపారు. పలు దుకాణాలు, బడ్డీకొట్లు, తోపుడు బండ్ల వారి వద్దకు వెళ్లి ముచ్చటించారు. వ్యాపారులతో మాట్లాడారు. అందరి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాగుంట, ఉగ్ర మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే పట్టణంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇంటింటికీ తాగునీటి కొళాయి ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Updated Date - Apr 28 , 2024 | 01:10 AM