Share News

ఎలుగుబంటి దాడి.. ఒకరికి గాయాలు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:11 AM

మందస మండలం టి.గంగువాడ గ్రామంలో శుక్రవారం సాయంత్రం తోటలో జీడి పిక్కలు ఏరుతుండగా ఎలుగు దాడి చేయడంతో చిత్త ధనరాజు తీవ్ర గాయాల పాలయ్యాడు.

ఎలుగుబంటి దాడి.. ఒకరికి గాయాలు

హరిపురం: మందస మండలం టి.గంగువాడ గ్రామంలో శుక్రవారం సాయంత్రం తోటలో జీడి పిక్కలు ఏరుతుండగా ఎలుగు దాడి చేయడంతో చిత్త ధనరాజు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఎలుగు దాడి సమయంలో పక్కనే భార్య, మరో ఇద్దరు బంధువులు ఉండడం తో వారు పెద్దగా కేకలు వేయడంతోపాటు కత్తులు, కర్రలు పట్టుకొని వెంబడించటంతో ఎలుగు తోటల్లోకి పారిపోయింది. దీంతో ప్రాణాపాయం తప్పింది. బాధితునికి హుటాహుటిన హరిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండలు పూర్తిగా తొలగించి కంకర అక్రమ రవాణా జరుపుతుండడంతో కొండల్లో ఉండాల్సిన ఎలుగులు గ్రామాలు, తోట ల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:11 AM