Home » Andhra Pradesh » Srikakulam
పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో రైతుబజారు ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ఆర్భాట ప్రకటనలే తప్ప హామీ మాత్రం కార్యరూపం దాల్చలేదు. పలాస- కాశీబుగ్గలో రైతుబజారు ఏర్పాటుకు రూ.50లక్షలు కేటాయిస్తామని.. సీఎం జగన్ ప్రకటించినా ఇంతవరకూ నిధులు మంజూరు చేయలేదు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శనివారం విడుదల చేసిన వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. గత ఎన్నికల ఇచ్చిన హామీలేవీ సక్రమంగా అమలుకాలేదు. కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి ఐదేళ్లూ నిర్లక్ష్యం వహించారు. ప్రస్తుతం తాజాగా ప్రకటించిన మేనిఫెస్టోలోనూ పాత అంశాలే ప్రస్తావించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల హడావుడి వేళ.. కొంతమంది వైసీపీ నేతలు ఇసుక దోపిడీకి తెరలేపారు. ఓ పోలీసు అధికారి పేరు చెప్పి.. దందా సాగిస్తున్నారు. అనుమతుల్లేకుండానే రోజుకు రూ.15 లక్షల మేర ఇసుక నిల్వలు అక్రమ రవాణా చేస్తున్నారు.
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తికావడంతో ప్రచారంపై రాజకీయ పార్టీలు దృష్టిసారించాయి. గతానికి భిన్నంగా పార్టీల అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. వీధుల్లో మైక్లతో హోరెత్తిస్తుండగా, ఇళ్లలో ఉండే సెల్ఫోన్లకు అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికావడం, స్మార్ట్ఫోన్లు ప్రతి ఇంటా ఉండడంతో అభ్యర్థులు వాట్సాప్ ద్వారా ప్రతి అంశం షేర్ చేస్తున్నారు. తమకు ఓటు వేస్తే చేయబోయే అంశాలను ఐవీఆర్ ద్వారా వివరిస్తున్నారు. వారంరోజులుగా ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థుల తరపున ఆయా పార్టీల మద్దతుదారులు, పార్టీ కార్యాలయాల ప్రతినిధులు ఫోన్చేసి వచ్చే నెల 13న జరిగే పోలింగ్లో తమ అభ్యర్థికి ఓటు వేయాలని పదేపదే కోరుతున్నారు. దీనివల్ల ఫోన్రింగ్ అవుతున్న సమయంలో లిఫ్ట్ చేసేందుకు చాలామంది ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. గుర్తుతెలియని నంబరు నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయడానికి ఇష్టపడడం లేదు. బంధువులు, స్నేహితులు పను లపై చేసే సమయంలో కూడా ఈ నెంబరు ఎవరిదోనని తికమకప డుతున్నారు. ప్రశాంతతను కోరుకునే గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా సెల్ఫోన్కు దూరంగా ఉంటారు. కొద్దిరోజులుగా ఎక్కువ సార్లు ఫోన్లు వస్తుండడంతో విసుగు చెందుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం అనంతరం 1957లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు రాష్ట్రంలో 55,61,345 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా... 36,03,585 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. మరి ఇప్పుడో...ఈ ఓటర్ల సంఖ్య ఒక జిల్లా ఓటర్లతో సమానం.. నాటికీ నేటికీ ఎంత తేడా. 1957లోని మరికొన్ని విశేషాల సమాహారం కొత్తతరం ఓటర్ల కోంం..
ఈవీఎంలో మనం ఎవరికి ఓటు వేశామో చూసుకోవచ్చు. నచ్చిన అభ్యర్థి పార్టీకి వేసిన ఓటు సక్రమమేనా లేక క్రాస్ అయిందా అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఓటరు వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్) ద్వారా కల్పిస్తోంది. వేసిన ఓటును చూసుకునే అవకాశం ఏడు సెకన్ల వరకు మాత్రమే ఉంటుంది. అనంతరం ఆ ఓటు వీవీ ప్యాడ్ బాక్స్లో పడిపోతుంది. ఈ విధానాన్ని తొలిసారిగా 2013 సెప్టెంబరులో నాగాలాండ్లో నోక్సెల్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాలలో అమలు చేశారు. ఆ తరువాత దశల వారీగా అంతటా అమల్లోకి వచ్చింది. వేసిన ఓటును సెల్ఫోన్ ద్వారా చిత్రీకరించడం, బహిర్గతం చేయడం మాత్రం నిషేధం. ఉల్లంఘిస్తే ఓటు రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల ప్రవేశాలకు సంబంధించి శనివారం జిల్లాలో నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది.
అనుబంధం.. ఆత్మీయత...అంతా ఓ బూటకం’ అన్నాడో సినీ కవి. అనుబంధం సంగతి ఎలా ఉన్నా... ప్రస్తుత ఎన్నికల సమయంలో ‘ఆత్మీయత’ మా త్రం ఓ నాటకమే నన్నది అక్కడక్కడా చోటుచేసుకుంటున్న ‘రాజకీయ’ సంఘటనలను బట్టి తెలుస్తోంది. ఈ మాటల్లో నిజమెంతో తెలియాలంటే... ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఎత్తుగడలు చూస్తే చాలు. ఓవైపు అభ్యర్థి ఖర్చులపై ఎన్నికల కమిషన్ నిఘా...మరోవైపు పైసలు తీయకపోతే ‘కార్యకర్తలు’ కరువైపోయే పరిస్థితి. ఇది పోటీలో ఉన్న వారికి మింగుడు పడ డం లేదు. అందుకే తాజాగా నాయకులు ‘ఆత్మీయ సమావేశాల’ను ఎంచుకుంటున్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకుల దృష్టిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమతో వస్తున్న కార్యకర్తలందరికీ మద్యం, బిర్యాని, డబ్బులు ఇచ్చేందుకు పుట్టిన రోజులు, పెళ్లి రోజులు అని చెప్పి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో నాయకులు తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. అనంతరం కార్యకర్తలందరికీ మద్యం, బిర్యాని, డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఇది ఎన్నికల వ్యయం కింద రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఎన్నికలొచ్చాయంటే నగదు, మద్యానిదే కీలక భూమిక. నోటిఫికేషన్ మొదలు ఓటరు పోలింగ్ కేంద్రానికి వెళ్లే వరకూ ఈ రెండే ప్రభావం చూపిస్తుంటాయి. ఓటర్లను దారి లోకి తెచ్చుకోవాలన్నా.. ఫిరాయింపులు అడ్డుకోవాలన్నా వీటి అవసరం అంతా ఇంతా కాదు. జేబులో చేయి పెట్టి నోటు తీస్తే కట్టంతా ఇవ్వాలని అడిగే రోజులివి. అభ్యర్థుల అదృష్టమో.. ఓటరు దురదృష్టమో తెలియదు గానీ ఈ ఎన్నికల్లో పెద్ద నోట్లు కనిపించకుండా పోయాయి. 2014 సాధారణ ఎన్నికల్లో పెద్ద నోటు అంటే వెయ్యి ఒక్కటే. ఆ తరువాత నోట్ల రద్దుతో వెయ్యి నోటు అడ్రస్ లేకుండా పోయింది. 2019 ఎన్నికల నాటికి రూ.2 వేల నోటు వచ్చింది. ఇప్పుడు అదీ కనిపించడం లేదు. జేబులోకి చెయ్యి పోనిస్తే రూ.500 నోటు లేదా రూ.200 నోటు పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఓటరుకైనా, నాయకుడికైనా పెద్ద నోటు ప్రస్తుతానికి ఇదే. అలాగని ఒకటో, రెండో నోట్లు ఇచ్చినా ఓటరు సంతృప్తి పడే రోజులు పోయాయని అభ్యర్థులు ఇప్పుడు పెద్ద నోట్ల వేటలో పడ్డారు.
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదివారం జిల్లాకు రానున్నారని డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల న్యాయ యాత్ర చేపడుతున్నారు.