Share News

డీసీసీబీ మాజీ చైర్మన్‌ జగన్‌ వైసీపీకి రాజీనామా

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:12 AM

డీసీసీబీ మాజీ చైర్మన్‌ డోల జగన్‌ వైసీపీకి రాజీనామా చేస్తు న్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఓ ప్రైవేటు హోటల్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీలో క్రియా శీలకంగా పనిచేసిన తాను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు.

డీసీసీబీ మాజీ చైర్మన్‌ జగన్‌ వైసీపీకి రాజీనామా

శ్రీకాకుళం అర్బన్‌: డీసీసీబీ మాజీ చైర్మన్‌ డోల జగన్‌ వైసీపీకి రాజీనామా చేస్తు న్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఓ ప్రైవేటు హోటల్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. వైసీపీలో క్రియా శీలకంగా పనిచేసిన తాను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు. నరసన్నపేటలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బగ్గు రణమూర్తి విజయానికి తోడ్పడతానన్నారు. తాను ఏ పార్టీలో చేరేదీ త్వరలో చెబుతానన్నారు. గడిచిన ఐదేళ్లలో బటన్‌ నొక్కి డబ్బులు వేస్తున్నానని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ప్రజల కష్టాలను తీర్చలేకపోయిందని విమర్శించారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటేనే రైతు సంక్షేమం సాధ్యపడుతుందని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు.

Updated Date - Apr 20 , 2024 | 12:12 AM