Share News

ప్రశాంతంగా పాలిసెట్‌

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:52 PM

పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సుల ప్రవేశాలకు సంబంధించి శనివారం జిల్లాలో నిర్వహించిన పాలిసెట్‌ ప్రశాంతంగా ముగిసింది.

ప్రశాంతంగా పాలిసెట్‌

ఎచ్చెర్ల/ టెక్కలి, ఏప్రిల్‌ 27: పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సుల ప్రవేశాలకు సంబంధించి శనివారం జిల్లాలో నిర్వహించిన పాలిసెట్‌ ప్రశాంతంగా ముగిసింది. శ్రీకాకుళం డివిజన్‌లోని 26 కేంద్రాల్లో 7,195 మందికిగాను 6,4 92 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. టెక్కలి డివిజన్‌లోని 16 కేంద్రాల్లో 4,8 16 మంది విద్యార్థులకు గాను 4,362 మంది హాజరయ్యారు. మొత్తంగా 90. 37శాతం హాజరైనట్టు జిల్లా సమన్వయకర్తలు గురుగుబెల్లి దామోదరరావు, ఎ.గోపి తెలిపారు. టెక్కలిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రా న్ని ఉపవిద్యాశాఖాధికారి పి.విలియమ్స్‌ పరిశీలించారు. సూపరింటెండెంట్‌ రోణంకి శ్రీనివాస్‌తో పాటు అబ్జర్వర్‌ లోకేష్‌, బెనర్జీ పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:52 PM