Share News

నేడు వైఎస్‌ షర్మిల రాక

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:50 PM

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆదివారం జిల్లాకు రానున్నారని డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల న్యాయ యాత్ర చేపడుతున్నారు.

నేడు వైఎస్‌ షర్మిల రాక

టెక్కలి, పలాసలో పర్యటన

శ్రీకాకుళం క్రైం/ టెక్కలి, ఏప్రిల్‌ 27: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆదివారం జిల్లాకు రానున్నారని డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల న్యాయ యాత్ర చేపడుతున్నారు. ఈ మేరకు జిల్లాలోని టెక్కలి, పలాసలో పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు టెక్కలిలోని ఇందిరాగాంధీ కూడలిలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు పలాస చేరుకుంటారు. అక్కడ పాత బస్టాండ్‌ ఆవరణలో నిర్వహించనున్న సభలో ప్రసంగిస్తారు. పర్యటనలో ఇండియా కూటమి నాయకులు పాల్గొనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి షర్మిల పర్యటనను విజవంతం చేయాల’ని పేడాడ పరమేశ్వరరావుతో పాటు కేంద్రమాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కిల్లి కృపారాణి కోరారు.

Updated Date - Apr 27 , 2024 | 11:50 PM