Share News

జిల్లా కేంద్రంలో విజయచంద్ర ప్రచారం

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:10 AM

జిల్లా కేంద్రం పార్వతీపురంలోని 26వ వార్డులో టీడీపీ కూటమి అభ్యర్థి బోనెల విజయచంద్ర విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

 జిల్లా కేంద్రంలో విజయచంద్ర ప్రచారం

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: జిల్లా కేంద్రం పార్వతీపురంలోని 26వ వార్డులో టీడీపీ కూటమి అభ్యర్థి బోనెల విజయచంద్ర విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు సైకిల్‌ గుర్తుపై, అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ద్వారపురెడ్డి శ్రీదేవి, బార్నాల సీతారాం, కోరాడ నారాయణరావు, బడే గౌడ్‌నాయుడు, పి.వెంకటరమణ, జి.రవికుమార్‌, మజ్జి వెంకటేష్‌, పాలకొండ మరియదాసు, పాలకొండ రాజశేఖర్‌, గంట శ్రీను, శొంటేను మురళీ, చుక్క పోలినాయుడు, జనసేన నాయకులు అనీల్‌, గోవిందమ్మ, బీజేపీ నాయకురాలు పార్వతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:10 AM