Share News

వాహనాల పైకి వెళ్ళిన లారీ.. తప్పిన ముప్పు

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:45 AM

ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గొల్లగూడెం గ్రామాల మధ్య రహదారిపై లారీకి బ్రేక్‌ ఫెయిలై బీభత్సం సృష్టించింది.

 వాహనాల పైకి వెళ్ళిన లారీ.. తప్పిన ముప్పు

ఆగిరిపల్లి, ఏప్రిల్‌ 27: ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గొల్లగూడెం గ్రామాల మధ్య రహదారిపై లారీకి బ్రేక్‌ ఫెయిలై బీభత్సం సృష్టించింది. రహదారి పక్కన పార్క్‌ చేసి ఉన్న రెండు బైకులు, ఒక ఆటో, కరెంటు పోల్‌ని ఢీకొని సమీపాన మట్టిలో ఆగిపోయింది. లారీ నూజివీడు నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈదర గ్రామానికి చెందిన డ్రైవర్‌ గురుముచ్చు చిన్న పండు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంపై పోలీసులు వివరాలు సేకరించారు.

Updated Date - Apr 28 , 2024 | 12:45 AM