Share News

పేదలను దోచుకునే వైసీపీని సాగనంపాలి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:34 AM

పేదలను దోచుకుని తినే వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఉంగూటరు కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు ్చఅన్నారు.

పేదలను దోచుకునే వైసీపీని సాగనంపాలి
జల్లికాకినాడలో ప్రచారం చేస్తున్న పత్సమట్ల

ఉంగుటూరు కూటమి అభ్యర్థి పత్సమట్ల

గణపవరం/ఉంగుటూరు, ఏప్రిల్‌ 27: పేదలను దోచుకుని తినే వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఉంగూటరు కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు ్చఅన్నారు. శనివారం గణపవరం మండలం జల్లికాకినాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐదేళ్లలో విధ్వంస పాలన కొనసాగించిన సీఎం జగన్‌ను ఎన్నికల్లో తరిమికొట్టాలన్నారు. 30 మందికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు దండు శ్రీహరిరాజు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు అద్దేపల్లి వాసురాజు, టీడీపీ నాయకుడు దండు శ్రీనివాసరాజు, బంటుమిల్లి జార్జ్‌, మల్లంపల్లి సీతాలయ్య, వేగేశ్న సూర్యనారాయణరాజు, జనసేన నాయకుడు కర్తాక పల్లయ్య, బీజేపీ నాయకుడు ఇందుకూరి అశోకచక్రవర్తి వర్మ, తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరులోని పార్టీ కార్యాలయంలో దక్షిణ భారత తెలగ కాపు, బలిజ సంఘం జాయింట్‌ కన్వీనర్‌ దాసరి రాము మాట్లాడుతూ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఈ సందర్భంగా శనివారం ధర్మరాజును కలిసి మద్దతు తెలిపారు. ఉంగుటూరు మండలం నారాయణపురం, కైకరం గ్రామాల్లో టీడీపీ, జనసేన నాయకులు ధాన్యం పట్టుబడి కూలీలను, ఉపాధి హామీ కూలీలను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. శనివారం సాయంత్రం గోపాలపురం, పందిరెడ్డిగూడెం గ్రామాల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుతో కలసి ధర్మరాజు ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు.

Updated Date - Apr 28 , 2024 | 12:34 AM