జగన్ అరాచకాలపై చార్జిషీట్ దాఖలు చేస్తాం
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:32 AM
జగన్ అరాచకాలపై చార్జిషీట్ దాఖలు చేస్తాం. సొంత బాబాయ్ని చంపి ఆ నెపం చంద్రబాబు నాయుడిపై వేశారు.
చింతలపూడి కూటమి అభ్యర్థి సొంగా రోషన్కుమార్
లింగపాలెం/చింతల పూడి, ఏప్రిల్ 27: జగన్ అరాచకాలపై చార్జిషీట్ దాఖలు చేస్తాం. సొంత బాబాయ్ని చంపి ఆ నెపం చంద్రబాబు నాయుడిపై వేశారు. సొంత చెల్లెళ్ళనే బయటకు తోసేశాడని, చెల్లెళ్లకు రక్షణ లేకుండా పోయిందంటే రాష్ట్రంలో ఉన్న అక్కాచెల్లెమ్మలకు జగన్ ఎలా న్యాయం చేస్తారని చింతలపూడి కూటమి అభ్యర్థి సొంగా రోషన్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం లింగపాలెం మండలంలోని లింగపాలెం, సింగగూడెం, మల్లేశ్వరం గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. మండల అధ్యక్షుడు గరిమెళ్ళ చలపతిరావు, మోరంపూడి మల్లికార్జునరావు, పామర్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి లేదని, వైసీపీ విధానాలు నచ్చక తాము టీడీపీలో చేరుతున్నామని వారు తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలన్నారు. నియోజకవర్గ పరిశీలకులు ఆరేపల్లి రామారావు, ముసునూరి రాము, కూరపాటి వెంకటేశ్వరరావు, గుత్తా సత్యసాయి వరప్రసాద్, గారపాటి బుజ్జియ్య, మోరంపూడి ప్రసాద్, బొంతు రాంబాబు, బొంతు శ్రీనివాసరావు, అసిలేటి అజయ్, తాడేపల్లి దాసు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం శనివారం చింతలపూడి మండలంల రాఘవాపురంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త పోలగాని సాయి కుటుంబాన్ని రోషన్కుమార్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీడీపీ నాయకులు జె.ముత్తారెడ్డి, మాటూరి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.