Share News

NRI: తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:14 PM

తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ వాసులు ఉగాది పండుగ సాంస్కృతిక ఉత్సవాలు డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్ లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతం చేసారు.

NRI: తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
Ugadi Celebrations

తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో ఉగాది పండుగ సాంస్కృతిక ఉత్సవాలు డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్ లో అంగరంగ వైభవంగానిర్వహించారు. దాదాపు 1500 మందికి పైగా తెలంగాణ వాసులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గుప్తేశ్వరి వాసుపిల్లి, సరిత ప్యారసాని, ప్రసన్న గుజ్జుల, భవాని సామల, విజయ చిత్తలూరి జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది ఉత్సవాన్ని ప్రారంభించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ, వ్యవస్థాపక సభ్యుల సహకారంతో నిర్వహించిన ఉగాది వేడుకలు విజయవంతమయ్యాయి.


ప్రముఖ పూజారి నరసింహ చారి పంచాంగ శ్రవణం చేశారు. శ్రీరంజని కందూరి, కుమారి ప్రహళిక మ్యాకలు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వహరించారు. ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది.


ప్రాంతీయ చిన్నారులతో ప్రవీణ్ నీలా దర్శకత్వంలో రూపొందించిన కృష్ణం వందే జగద్గురుం నాటిక ప్రేక్షకులను మనోరింజింపజేసింది. మనబడి చిన్నారులచే ప్రదర్శించబడిన బుర్రకథకు విశేషాదరణ లభించింది. మొత్తం 87 మంది 25 వినూత్నమైన ప్రదర్శనలు ఇచ్చారు.

NRI: వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం


ఉగాది సంచిక..

తెలంగాణ కెనడా సంఘం వారి అధికారిక తెలుగు పత్రిక “TCA ఉగాది సంచిక” తృతీయ సంచికను NCPL అదినేత రాంబాబు వాసుపిల్లి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంబాబు వాసుపిల్లి మాట్లాడుతూ.. మాతృభాషని ప్రోత్సహిస్తున్న తెలంగాణ కెనడా సంఘానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ కెనడా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ మన మాతృభాష యొక్క ప్రాముఖ్యతను నేటి తరం నుంచి భావి తరాలకు అందిచడమే లక్ష్యంగా ఈ సంచికను రూపొందించామన్నారు.


ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి, కార్యదర్శి శంతన్ నారెళ్ళపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ళ, డైరెక్టర్లు నాగేశ్వరరావు దలువాయి, ప్రణీత్ పాలడుగు, శంకర్ భరద్వాజ పోపూరి, ప్రవీణ్ కుమార్ శ్యామల, భగీరథ దాస్ అర్గుల, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, హరి రాహుల్, కలీముద్దీన్ మొహమ్మద్, శ్రీనివాస తిరునగరి, ప్రకాష్ చిట్యాల, రాజేశ్వర్ ఈద, ప్రభాకర్ కంబాలపల్లి, విజయ్ కుమార్ తిరుమలపురంతో పాటు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల కృతజ్ఞతా వందన సమర్పణతో ఉగాది 2024 వేడుకలు టొరంటో లో ఘనంగా ముగిశాయి.


UAE: యుఏఈలో ‘తెలుగు తరంగిణి’ ఉగాది ఉత్సవం

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 16 , 2024 | 01:16 PM