Share News

Saudi Arabia: సౌదీ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆంధ్రుల మృతి

ABN , Publish Date - Apr 05 , 2024 | 06:42 PM

సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు.

Saudi Arabia: సౌదీ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆంధ్రుల మృతి

  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

  • ఆంధ్ర నుండి అడుగుడిగిన కొద్ది సేపటిలోనే మామ, అల్లుళ్ళ మృతి

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలో (Saudi Arabia) శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం నర్రవాడకు చెందిన ఒక ప్రవాసీ (NRI) కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

​సెలువులలో తన కూతురు వద్ద గడపడానికి ప్రత్యేకించి గుంటూరు నుండి సౌదీలో అడుగుడిగిన కొద్ది సేపటికే జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడు ఇద్దరూ మరణించగా, కూతురు అమె ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

NRI: త్వరలో గల్ఫ్ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం


​గుంటూరు నగరంలోని రత్నగిరినగర్‌కు చెందిన అన్న వెంకట రామరావు సౌదీ అరేబియాలోని జుబేల్ పారిశ్రామిక నగరంలో పని చేసే తన అల్లుడు భవనాసి సత్యబాబు, కూతురు, మనవళ్ళతో గడపడానికి సౌదీకి రాగా ఆయనకు దమ్మాంలోని అంతర్జాతీయ విమానశ్రాయంలో కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత వారు జుబేల్‌కు తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అల్లుడు, మామ ఇద్దరూ అక్కడికక్కడే మరణించగా కూతరు, అమె ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

​గల్ఫ్‌లో రంజాన్ పండుగ సెలువులు వారం రోజుల వరకు ఉంటాయి. మరో పది, పన్నెండు రోజుల వరకు మృతదేహాలను స్వదేశానికి పంపించడం కుదరదని కుటుంబానికి సహకరిస్తున్న తెలుగు ప్రవాసీ సంఘం సాటా ప్రతినిధులు ముజ్జమ్మీల్ షేఖ్, తారక్, పవన్‌లు తెలిపారు.

TDP Foundation Day: కువైట్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.. మిన్నంటిన తెలుగు తమ్ముళ్ల సంబరాలు

మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 05 , 2024 | 06:46 PM