Home » Andhra Pradesh
Andhrapradesh: జిల్లాలో అర్ధాతరంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్లు మూసివేశారు. గడువు ఉండగానే పోలింగ్ బూత్లు మూసివేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ బూత్లను అధికారులు మూసివేశారు. అయితే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నేటి వరకు గడువు ఉంది.
మంత్రి బొత్స సత్యనారాయణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. పచ్చకామెర్ల వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని అన్నారు. అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని పురందేశ్వరి ఫైర్ అయ్యారు. బొత్స చేసిన వోక్స్ వాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.
Andhrapradesh: తెలుగు దేశం పార్టీకి ముస్లిం సంఘాలు పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవాలని, చంద్రబాబు సీఎం అవ్వాలని ముస్లిం సంఘాల నేతలు కోరుతున్నారు. తాజాగా టీడీపీకి జమాత్ ఉలమ ఏ హింద్ పూర్తి మద్దతు తెలిపింది. గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జమాత్ ఉలమ ఏ హింద్ జాతీయ అధ్యక్షులు మౌలానా సుహైబ్ ఖాసిమి భేటీ అయ్యారు.
ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు(ap elections 2024) కొద్ది రోజుల ముందే ఆదాయపన్ను శాఖ దాడులు(ir raids) కలకలం రేపుతున్నాయి. దీంతో పలువురు కీలక నేతలతోపాటు బడా వ్యాపారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నేత గంగాధర్ ఇంట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించి రూ.1.5 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ(telangana)లో 5 రోజులు మోస్తరు వర్షాలు(rains) కురుస్తాయని హైదరాబాద్(hyderabad) వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు విదర్భ, మహారాష్ట్ర, తమిళనాడులలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చివర దశకు చేరుకుంది. బీజేపీ అధిష్టానం అయితే తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ నుంచి కేంద్ర హో మంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్ర నేతలంతా తెలంగాణలో ఒకరి తర్వాత ఒకరు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎలాగైనా పెద్ద మొత్తంలో ఎంపీ సీట్లను రాబట్టుకోవాలని బీజేపీ అధిష్టానం పట్టుదలతో ఉంది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. పార్టీలన్నీ ఈ ఎన్నికలను సవాల్గా తీసుకున్నాయి. అధికారం కోల్పోకూకడదని వైసీపీ.. అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్డీఏ కూటమి పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నాయి. నేడు కర్నూలు నగరానికి సీఎం జగన్ రానున్నారు. ఎస్బీఐ సర్కిల్ వైఎస్సార్ విగ్రహం వద్ద జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
జగన్ పాలనలో ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి జాడ లేదు. సంక్షేమ పథకాల అమల్లోనూ లబ్ధిదారుల జాబితాల్లో కోతలు, నిధుల కత్తిరింపులు, ఎగవేతలు, వాయిదాలు.
ఎప్పుడూ పోలీసులే వాహనాలను తనిఖీ చేయాలా..? ఏం.. వారి వాహనాలను మాత్రం తనిఖీ చేయకూడదా..? ఎన్నికల నేపథ్యంలో అనంతపురం నగరంలో పోలీసు వాహనాలను అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న ఆధ్వర్యంలో అధికారులు బుధవారం తనిఖీ చేశారు. అధికార పార్టీ అభ్యర్థుల తరఫున కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ఓట్ల కొనుగోలుకు పూనుకోవడం గురించి ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు వస్తున్నాయి. ఓటుకు రూ.3 వేలు ఇస్తామని పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, అనంతపురం అర్బనలో ఈ వ్యవహారం..
విజయవాడలో టీడీపీ-బీజేపీ-జనసేన (ఎన్డీయే) కూటమి చేపట్టిన రోడ్ షో సూపర్ హిట్ అయ్యింది. గంటన్నర సేపు బెజవాడ వీధుల్లో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి సంయుక్తంగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోపై పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు.