పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ వారాహి యాత్ర దృశ్యాలు..
ABN, Publish Date - Apr 22 , 2024 | 11:32 AM
పశ్చిమ గోదావరి జిల్లా: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం నరసాపురం, భీమవరంలో వారాహి యాత్ర నిర్వహించారు. పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహించి, అనంతరం భారీ బహిరంగ సభల్లో మాట్లాడారు. రెండుచోట్ల మూడు పార్టీల శ్రేణులతోపాటు పవన్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పట్టణాల రహదారులు జన సంద్రంగా మారాయి. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వ హయాంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ఆక్వా రంగం జగన్ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. మేం అధికారంలోకి రాగానే ఈ రంగాన్ని మెరుగు పరుస్తాం. లేసు పరిశ్రమకు సబ్సిడీలు ఇచ్చి పూర్వ వైభవం తీసుకొస్తా. మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే బాధ్యత నాది. మరుగున పడిన సొసైటీలకు పూర్వ వైభవం తీసుకుని వస్తా. భీమవరం పట్టణానికి రింగు రోడ్డు, అవసరమైన వంతెనలను ఏర్పాటు చేస్తాం’’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
Updated at - Apr 22 , 2024 | 11:32 AM