హైదరాబాద్,సెప్టెంబర్ 2:
అడ్మిషన్లే మొదలుకాలేదు. అమ్మకాలు పూర్తయిపోయాయి. ఇదీ కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో యాజమాన్య కోటా (బి-కేటగిరీ) సీట్ల పరిస్థితి. ప్రభుత్వ నియంత్రణ కొరవడడంతో.. ఇక్కడ యాజమాన్యాలు చెప్పిందే వేదంగా మారింది. పారదర్శకతకు పాతరేసి.. మెరిట్కు మొండిచేయి చూపి... సీట్లను బ్లాక్ చేస్తున్నాయి. సీట్లు అయిపోయాయని నమ్మబలుకుతున్నాయి. కానీ, లోపాయికారీగా ఒక్కో సీటును లక్షలాది రూపాయలకు అమ్ముకుంటున్నాయి.